Railway Employees Bonus 2025: రైల్వే ఉద్యోగులకు బోనస్.. పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Railway Employees Bonus 2025: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం పలు కీలక ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ పండుగ సీజన్లో దాదాపు 11 లక్షల మంది రైల్వే ఉద్యోగులు బోనస్ ప్రకటించింది. రైల్వే సిబ్బంది అద్భుతమైన పనితీరును గుర్తించి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రైల్వే ఉద్యోగులకు రూ.1,865.68 కోట్ల బోనస్ చెల్లించడానికి ఆమోదం తెలిపిందని కేంద్ర సర్కార్ ఒక ప్రకటనలో తెలిపింది.
READ ALSO: KTR: బీజేపీ మోసం రాముడికి కూడా అర్థమైంది.. కరీంనగర్ ప్రజలు మాత్రం..!
Also Read
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
అర్హత కలిగిన ప్రతి రైల్వే ఉద్యోగికి 78 రోజుల వేతనానికి సమానమైన PLB గరిష్టంగా చెల్లించవలసిన మొత్తం ఒక్కొక్కరికి రూ. 17,951గా అంచానా. ఈ మొత్తాన్ని రైల్వే సిబ్బందిలో ట్రాక్ మెయింటెయినర్లు, లోకో పైలట్లు, రైలు మేనేజర్లు (గార్డ్), స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, టెక్నీషియన్ హెల్పర్లు, పాయింట్స్మన్, మినిస్టీరియల్ సిబ్బంది, ఇతర గ్రూప్ సి సిబ్బంది వంటి వివిధ వర్గాలకు చెల్లించనున్నారు. అర్హత కలిగిన రైల్వే ఉద్యోగులకు PLB చెల్లింపు ప్రతి ఏడాది దసరా సెలవులకు ముందు అందజేస్తున్నారు.
అలాగే కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటనతో పాటు, సాహెబ్ గంజ్ – బెట్టయ్య NH 139 నాలుగు లైన్ల రహదారి 79 కిమీ అభివృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.3822 కోట్లతో నిర్మితం కానున్న NH 139, రెండేళ్లలో పూర్తి కానున్నట్లు సమాచారం. భక్తియార్పూర్ – రాజ్గిర్ -తలయ రైల్వే లైన్ డబ్లింగ్కి కూడా కేబినెట్ ఆమోదం లభించింది. రూ. 2192 కోట్లతో 104 కి.మీ మేర రైల్వే లైన్ డబ్లింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ పనులతో బిహార్- జార్ఖండ్ మధ్య రైల్వే కనెక్టివిటీ పెరగనుంది. షిప్పింగ్ మారిటైమ్ అభివృద్ధి సంస్కరణల కోసం రూ.69725 కోట్లు కేటాయించారు.
READ ALSO: China New Virus: ఉత్తర కొరియాను వణికిస్తున్న.. చైనా కొత్త వైరస్..!
తాజావార్తలు
-
Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
-
Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
-
YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
-
Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!