Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, పరిపాలనా సౌలభ్యం కోసం మొత్తం రూ. 4,703 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో గుజరాత్లోని అహ్మదాబాద్ మెట్రో విస్తరణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణ ప్రాజెక్టులు ఉన్నాయి.
అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2A విస్తరణ..
రూ. 2,169 కోట్ల అంచనా వ్యయంతో అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2A విస్తరణ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద దాదాపు 6.032 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో కారిడార్ను నిర్మిస్తారు. ప్రస్తుతం ఉన్న అహ్మదాబాద్-గాంధీనగర్ కారిడార్ను విమానాశ్రయం (ఎయిర్పోర్ట్), ప్రతిపాదిత కామన్వెల్త్ గేమ్స్ కాంప్లెక్స్తో ఈ లైన్ అనుసంధానిస్తుంది. భవిష్యత్తులో జరగబోయే ‘వరల్డ్ పోలీస్ గేమ్స్ 2029’, ‘కామన్వెల్త్ గేమ్స్ 2030’లను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా వసతులను అభివృద్ధి చేయనున్నారు. ఈ నిర్మాణ పనులు జోరందుకున్న సమయంలో దాదాపు 2,000 మందికి, అలాగే మెట్రో నిర్వహణ సమయంలో మరో 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
అమరావతిలో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణం..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో పెద్దపీట వేసింది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, నివాస సముదాయాల నిర్మాణానికి భారీ నిధులను కేటాయించింది. రూ. 1,299 కోట్ల వ్యయంతో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్ను నిర్మిస్తారు. నగరంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోటకి తీసుకురావాలనేది దీని ముఖ్య ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వసతి కోసం రూ. 1,235 కోట్ల వ్యయంతో ఆధునిక నివాస సముదాయాలను నిర్మించనున్నారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాలు అటు గుజరాత్లో రవాణా రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా, ఇటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి మరింత ఊతాన్ని ఇస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!