Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, పరిపాలనా సౌలభ్యం కోసం మొత్తం రూ. 4,703 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో గుజరాత్లోని అహ్మదాబాద్ మెట్రో విస్తరణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణ ప్రాజెక్టులు ఉన్నాయి.
అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2A విస్తరణ..
రూ. 2,169 కోట్ల అంచనా వ్యయంతో అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2A విస్తరణ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద దాదాపు 6.032 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో కారిడార్ను నిర్మిస్తారు. ప్రస్తుతం ఉన్న అహ్మదాబాద్-గాంధీనగర్ కారిడార్ను విమానాశ్రయం (ఎయిర్పోర్ట్), ప్రతిపాదిత కామన్వెల్త్ గేమ్స్ కాంప్లెక్స్తో ఈ లైన్ అనుసంధానిస్తుంది. భవిష్యత్తులో జరగబోయే ‘వరల్డ్ పోలీస్ గేమ్స్ 2029’, ‘కామన్వెల్త్ గేమ్స్ 2030’లను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా వసతులను అభివృద్ధి చేయనున్నారు. ఈ నిర్మాణ పనులు జోరందుకున్న సమయంలో దాదాపు 2,000 మందికి, అలాగే మెట్రో నిర్వహణ సమయంలో మరో 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
Also Read
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
అమరావతిలో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణం..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో పెద్దపీట వేసింది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, నివాస సముదాయాల నిర్మాణానికి భారీ నిధులను కేటాయించింది. రూ. 1,299 కోట్ల వ్యయంతో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్ను నిర్మిస్తారు. నగరంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోటకి తీసుకురావాలనేది దీని ముఖ్య ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వసతి కోసం రూ. 1,235 కోట్ల వ్యయంతో ఆధునిక నివాస సముదాయాలను నిర్మించనున్నారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాలు అటు గుజరాత్లో రవాణా రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా, ఇటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి మరింత ఊతాన్ని ఇస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!