Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, పరిపాలనా సౌలభ్యం కోసం మొత్తం రూ. 4,703 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో గుజరాత్లోని అహ్మదాబాద్ మెట్రో విస్తరణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణ ప్రాజెక్టులు ఉన్నాయి.
అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2A విస్తరణ..
రూ. 2,169 కోట్ల అంచనా వ్యయంతో అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2A విస్తరణ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద దాదాపు 6.032 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో కారిడార్ను నిర్మిస్తారు. ప్రస్తుతం ఉన్న అహ్మదాబాద్-గాంధీనగర్ కారిడార్ను విమానాశ్రయం (ఎయిర్పోర్ట్), ప్రతిపాదిత కామన్వెల్త్ గేమ్స్ కాంప్లెక్స్తో ఈ లైన్ అనుసంధానిస్తుంది. భవిష్యత్తులో జరగబోయే ‘వరల్డ్ పోలీస్ గేమ్స్ 2029’, ‘కామన్వెల్త్ గేమ్స్ 2030’లను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా వసతులను అభివృద్ధి చేయనున్నారు. ఈ నిర్మాణ పనులు జోరందుకున్న సమయంలో దాదాపు 2,000 మందికి, అలాగే మెట్రో నిర్వహణ సమయంలో మరో 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
అమరావతిలో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణం..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో పెద్దపీట వేసింది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, నివాస సముదాయాల నిర్మాణానికి భారీ నిధులను కేటాయించింది. రూ. 1,299 కోట్ల వ్యయంతో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్ను నిర్మిస్తారు. నగరంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోటకి తీసుకురావాలనేది దీని ముఖ్య ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వసతి కోసం రూ. 1,235 కోట్ల వ్యయంతో ఆధునిక నివాస సముదాయాలను నిర్మించనున్నారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాలు అటు గుజరాత్లో రవాణా రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా, ఇటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి మరింత ఊతాన్ని ఇస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!