Bv Raghavulu: బీజేపీకి ఆదరణ తగ్గుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ప్రజల నుంచి ఒంటరవుతోంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం. మొన్నటి ఐదురాష్ట్రాల ఎన్నికల్లోనూ చావు తప్పి కన్నులొట్టబోయి బయట పడిందన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు. రాబోయే కాలంలో మత పరంగా ప్రజలను విభజించి అధికారంలోకి రావాలని చూస్తోంది. శ్రీరామనవమి, హనుమాన్ జయంతిలను ఘర్షణలకు ఉపయోగించుకుంది.
రాబోయే కాలంలో ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది. లౌకిక శక్తులన్నీ కలిసొచ్చి మతోన్మాదానికి వ్యతిరేకంగా కలిసి రావాలన్నారు. బీజేపీ మతోన్మాద శక్తులకు ఏపీలో రాజకీయ పార్టీలు పరోక్షంగా పని చేస్తున్నాయి. జనసేన పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట్నుంచి మతోన్మాద శక్తులతో కలిసే పని చేస్తుంది. ఇప్పటికైనా అందరూ కలిసి మతోన్మాద శక్తులపై కలిసి పోరాడాలి.
Also Read
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
- Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
- Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
- YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
వైసీపీ, టీడీపీ, జనసేన లౌకిక పార్టీలో కాదో తేల్చుకోవాలి. ఏపీలో విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచేశారు. పల్లెల నుంచి పట్టణాల వరకూ చెత్తకు కూడా పన్ను వసూలు చేస్తున్నారు. పోలవరం ముంపు గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిపివేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో నగదు బదిలీని మేం వ్యతిరేకిస్తున్నాం కేంద్రం ఒత్తిడితో వైసీపీ చాలా ఉత్సాహంగా ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోంది.
వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు అందరికంటే ముందే ఏపీలో అమలు చేశారు. డిస్కంలను ప్రైవేటీకరణ చేయడం కేంద్రం ఒత్తిడిలో భాగమే అన్నారు బీవీ రాఘవులు. వైసీపీ ప్రజా పక్షమా..? కేంద్రం పక్షమా..? ఏపీలో విశాలమైన ఉద్యమం చేయకముందే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలి. రేషనుకు బదులు నగదు బదిలీ పథకానికి ప్రజలెవరూ అంగీకరించొద్దు. రేషన్ నగదు బదిలీకు అనుమతి పత్రాలివ్వొద్దు. కోర్టుల్లో డాక్యుమెంట్లను దొంగిలించడం దురదృష్టకరం. ఈ ఘటనలో ఎవరిని నిందించాలి.. కోర్టులనా..? ప్రభుత్వాన్నా..? పోలీసులనా..? అని ఆయన ప్రశ్నించారు.
Read Also: Sai Ganesh: పోస్టుమార్టం చేయకుండా కాలయాపన
కోర్టులో దొంగతనం ఘటన పై ఉన్నత స్థాయి బృందాన్ని వేసి విచారణ చేయించాలి. చోరీ కేసునుపై కోర్టు సుమోటోగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వామపక్షాలు ఐక్యంగా పోరాడుతూనే ఉన్నాయన్నారు బీవీ రాఘవులు. చిన్న చిన్న తేడాలున్నా.. ఐక్యతను కొనసాగించేలా భవిష్యత్తు ప్రణాళికలుంటాయి. అమరావతి విషయంలో గతంలో చంద్రబాబు చేసిన తప్పే జగన్ కూడా చేస్తున్నారు. 1500 ఎకరాల్లో త్వరగా భవనాలు పూర్తి చేసి గృహప్రవేశం చేయమని చంద్రబాబుకి ఆనాడే చెప్పాం అన్నారు బీవీ రాఘవులు.
తాజావార్తలు
-
Oppo Reno 16, Reno 16c: ఒప్పో రెనో 16, రెనో 16సి భారత్ లో విడుదల.. ఏఐ ఫీచర్లు, 7000mAh బ్యాటరీ
-
Tollywood: టాలీవుడ్’కి మరో షాకింగ్ విలన్ దిగుతున్నాడు
-
Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల!
-
CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
-
Moto G77 Power: మోటో జి77 పవర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 50MP Sony LYTIA 600 కెమెరా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?