Jammu Kashmir : 200 అడుగుల లోతైన లోయలో పడిన బస్సు.. ముగ్గురు మృతి, 24 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir : జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో శనివారం ఓ బస్సు రోడ్డుపై నుంచి జారి 200 అడుగుల లోతైన లోయలో పడింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. భలేసా నుంచి థాత్రికి ఓ ప్రైవేట్ మినీ బస్సు వెళ్తుండగా భాటియాస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది అక్కడికక్కడే ఒక మహిళ చనిపోయారని, మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించారని వారు చెప్పారు. వీరిలో మరో మహిళ, బస్సు డ్రైవర్ కూడా ఉన్నారు.
Read Also:Telangana: అర్ధరాత్రి రోడ్డెక్కిన నిరుద్యోగులు.. రంగంలోకి సీఆర్పీఎఫ్ బలగాలు..
Also Read
- Vegetable Chips: బయట ఫుడ్స్కి గుడ్బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
- Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
ఎనిమిది మంది పరిస్థితి విషమం
మృతులను బషీరా బేగం (50), సలీమా బేగం (55), బస్సు డ్రైవర్ మహ్మద్ ఆసిఫ్ (25)గా గుర్తించారు. గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని, వారికి దోడాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షించడానికి సంఘటనా స్థలానికి చేరుకున్న దోడా డిప్యూటీ కమిషనర్ హర్విందర్ సింగ్, ప్రమాదానికి గల కారణాలను కనుగొనడానికి దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.
Read Also:IND vs PAK: అంబటి రాయుడు హాఫ్ సెంచరీ.. పాకిస్థాన్పై భారత్ ఘన విజయం! 15 రోజుల్లో రెండు కప్స్
రోడ్డు ప్రమాదంలో 22 మంది మృతి
నెల రోజుల క్రితం జమ్మూలోని అఖ్నూర్లో యాత్రికులతో వెళ్తున్న బస్సు 150 అడుగుల లోతైన లోయలో పడింది. ఈ ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోగా, 69 మంది గాయపడ్డారు. జమ్మూ-పూంచ్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్తో పాటు రాజస్థాన్కు చెందిన 90 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ వ్యక్తులు హత్రాస్ నుండి శివ్ ఖోడికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు.
తాజావార్తలు
-
Vegetable Chips: బయట ఫుడ్స్కి గుడ్బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
-
ISRO Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఇస్రోలో జాబ్స్కి నోటిఫికేషన్!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
-
Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!