Jammu Kashmir : 200 అడుగుల లోతైన లోయలో పడిన బస్సు.. ముగ్గురు మృతి, 24 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir : జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో శనివారం ఓ బస్సు రోడ్డుపై నుంచి జారి 200 అడుగుల లోతైన లోయలో పడింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. భలేసా నుంచి థాత్రికి ఓ ప్రైవేట్ మినీ బస్సు వెళ్తుండగా భాటియాస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది అక్కడికక్కడే ఒక మహిళ చనిపోయారని, మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించారని వారు చెప్పారు. వీరిలో మరో మహిళ, బస్సు డ్రైవర్ కూడా ఉన్నారు.
Read Also:Telangana: అర్ధరాత్రి రోడ్డెక్కిన నిరుద్యోగులు.. రంగంలోకి సీఆర్పీఎఫ్ బలగాలు..
Also Read
- Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
ఎనిమిది మంది పరిస్థితి విషమం
మృతులను బషీరా బేగం (50), సలీమా బేగం (55), బస్సు డ్రైవర్ మహ్మద్ ఆసిఫ్ (25)గా గుర్తించారు. గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని, వారికి దోడాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షించడానికి సంఘటనా స్థలానికి చేరుకున్న దోడా డిప్యూటీ కమిషనర్ హర్విందర్ సింగ్, ప్రమాదానికి గల కారణాలను కనుగొనడానికి దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.
Read Also:IND vs PAK: అంబటి రాయుడు హాఫ్ సెంచరీ.. పాకిస్థాన్పై భారత్ ఘన విజయం! 15 రోజుల్లో రెండు కప్స్
రోడ్డు ప్రమాదంలో 22 మంది మృతి
నెల రోజుల క్రితం జమ్మూలోని అఖ్నూర్లో యాత్రికులతో వెళ్తున్న బస్సు 150 అడుగుల లోతైన లోయలో పడింది. ఈ ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోగా, 69 మంది గాయపడ్డారు. జమ్మూ-పూంచ్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్తో పాటు రాజస్థాన్కు చెందిన 90 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ వ్యక్తులు హత్రాస్ నుండి శివ్ ఖోడికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు.
తాజావార్తలు
-
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ కు ‘నో’ చెప్పిన కీర్తి సురేశ్.. ‘బుజ్జి’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
-
Lorcan Tucker: టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా.. నేను ఇంకా నమ్మలేకపోతున్నా!
-
US Iran Talks: అమెరికా–ఇరాన్ మధ్య శాంతి దిశగా కీలక అడుగు..
-
God Of War : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న Jr. NTR – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’
-
Peddi OTT Release: రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పుడు ఇంట్లోనే.. కానీ ఈ ఒక్క భాషకు వెయిటింగ్ తప్పదు!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!