Bus Accident: మరో బస్సు ప్రమాదం.. హైటెన్షన్ వైర్ తగిలి బస్సు దగ్ధం
- మరో బస్సు ప్రమాదం
- హైటెన్షన్ వైర్ తగిలి బస్సు దగ్ధం
- ఇద్దరు మృతి.. 12 మందికి గాయలు
- ఐదుగురు పరిస్థితి విషమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలులో ఘోర బస్సు ప్రమాదాన్ని మరువక ముందే మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాజస్థాన్లోని జైపూర్లో బస్సు హైటెన్షన్ వైర్ తాకి మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు దగ్ధమైంది. ఇద్దరు సజీవదహనం కాగా.. పలువురు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Canada: కెనడాలో దారుణం.. భారత సంతతి మహిళ హత్య
Also Read
- IND Vs AFG: రోహిత్ 'చారిత్రాత్మక' రికార్డు.. గిల్ 'మెరుపు' ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
- Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
- Chiranjeevi : చరణ్ కష్టం చూసి 'ఇంత అవసరమా' అనుకున్నా
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
రాజస్థాన్లోని జైపూర్లోని మనోహర్పూర్ ప్రాంతంలో బస్సులో ఇటుక బట్టీకి చెందిన కార్మికులను తీసుకెళ్తోంది. తోడి గ్రామంలోకి బస్సు వస్తుండగా హైటెన్షన్ వైర్ తగిలింది. వెంటనే మంటలు చెలరేగడంతో ఇద్దరు కార్మికులు చనిపోగా.. 12 మందికి గాయాలయ్యాయి. స్థానికులు.. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం జైపూర్కు తరలించారు. మిగిలిన బాధితులంతా షాపురా సబ్-డిస్ట్రిక్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న మనోహర్పూర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఇది కూడా చదవండి: Delhi Acid Attack Case: ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్.. షాకైన పోలీసులు
గత వారం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన బస్సు.. ఏపీలోని కర్నూలు దగ్గర మంటలు అంటుకుని బస్సు దగ్ధమైంది. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని కలవరపాటుకు గురి చేసింది. డ్రైవర్ నిర్లక్ష్యంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది.
नहीं थम रहा प्राइवेट बसों में मौत का सिलसिला, राजस्थान के जयपुर में एक और बड़ा हादसा, बिजली के हाईटेंशन तारों से टकराकर चलती बस में लगी आग, दो यात्रियों की मौत, 10 से ज्यादा झुलसे, बसों में आग के कारण जैसलमेर में 26 और आंध्रप्रदेश में 20 यात्रियों की हुई थी मौत#BusFire #Jaipur pic.twitter.com/DQ6LRf5h0h
— Sumit Saraswat SP (@SumitSaraswatSP) October 28, 2025
#WATCH | Jaipur, Rajasthan: A bus full of labourers caught fire after it touched a high-tension wire in Todi village, Manoharpur police station area. The injured were taken to Shahpura Sub-District Hospital. More details awaited.
(Visuals from the hospital) pic.twitter.com/sw4ko5q4RK
— ANI (@ANI) October 28, 2025
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!