Milk Price Hike: మండుతున్న నిత్యావసరాల ధరలు.. ఏడాదిలో 10శాతం పెరిగిన పాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Milk Price Hike: ద్రవ్యోల్బణం కారణంగా దేశవ్యాప్తంగా సామాన్యుల తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం సామాన్యుల జీవనాన్ని అతలాకుతలం చేసింది. కొంతకాలంగా టమాటా, కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకాయి. మరోవైపు పాల ధర కూడా భారీగా పెరిగింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత ఏడాది కాలంలో పాల ధర 10 శాతం వరకు పెరిగింది. ఈ ఏడాది జూన్లో టోన్డ్ మిల్క్ ధరలు ఏడాది క్రితం అంటే 2022 జూన్లో 9 శాతం ఎక్కువగా ఉన్నాయని, జూన్ 2023లో ఫుల్ క్రీమ్ మిల్క్ ధరలు ఏడాది కంటే 10 శాతం ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది.
Read Also:Jailer: ‘జైలర్’కి సూపర్ హిట్ టాక్.. నెల్సన్ ను కలిసి కంగ్రాట్స్ చెప్పిన సీఎం
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మంత్రి రూపాలా పార్లమెంటు ఎగువ సభలో ఎన్డిడిబి డేటాను వెల్లడించారు. గత మూడేళ్లలో పాల ధరలు పెద్దగా పెరగలేదని చెప్పారు. జాతీయ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి అందిన సమాచారం ప్రకారం గత మూడేళ్లుగా పాల ధరలు పెద్దగా పెరగలేదన్నారు. గత ఏడాది గణాంకాలు భిన్నమైన లెక్కలను అందిస్తున్నాయి. జూన్ 2022లో టోన్డ్ మిల్క్ ధర లీటరుకు రూ. 47.4 ఇప్పుడు టోన్డ్ మిల్క్ లీటరు రూ.51.6గా మారింది. ఈ విధంగా టోన్డ్ మిల్క్ ధరలు ఏడాదిలో 8.86 శాతం పెరిగాయి. మరోవైపు, ఫుల్ క్రీమ్ మిల్క్ విషయానికొస్తే జూన్ 2022లో లీటరుకు రూ.58.8గా ఉన్న ధరతో పోలిస్తే లీటరుకు 9.86 శాతం పెరిగి రూ.64.6కి చేరుకుంది.
Read Also:Infosys Narayana Murthy: ఇండియాలో జనాభా నియంత్రణ అవసరం
దేశంలో పాల ధరలను పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ నియంత్రించడం లేదని మంత్రి పార్లమెంటుకు తెలిపారు. దేశంలో పాల కొనుగోలు, అమ్మకాలపై ప్రభుత్వం నియంత్రణ లేదని అన్నారు. దీని ధరలను సహకార, ప్రైవేట్ డెయిరీలు వాటి ధర, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయిస్తాయి. గత కొన్ని నెలలుగా దేశంలో అనేక ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. టమాటా పలు నగరాల్లో కిలో ధర రూ.200 దాటడంతో రూ.300 వరకు వెళ్లే అవకాశం ఉంది. కూరగాయలు కూడా చాలా ఖరీదైనవి. మసాలా దినుసుల ధరలు కూడా మండి పడ్డాయి. ఇప్పుడు వచ్చే 1-2 నెలల్లో ఉల్లి ధరలు రెట్టింపు అవుతాయని సామాన్యులు భయపడుతున్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!