Milk Price Hike: మండుతున్న నిత్యావసరాల ధరలు.. ఏడాదిలో 10శాతం పెరిగిన పాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Milk Price Hike: ద్రవ్యోల్బణం కారణంగా దేశవ్యాప్తంగా సామాన్యుల తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం సామాన్యుల జీవనాన్ని అతలాకుతలం చేసింది. కొంతకాలంగా టమాటా, కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకాయి. మరోవైపు పాల ధర కూడా భారీగా పెరిగింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత ఏడాది కాలంలో పాల ధర 10 శాతం వరకు పెరిగింది. ఈ ఏడాది జూన్లో టోన్డ్ మిల్క్ ధరలు ఏడాది క్రితం అంటే 2022 జూన్లో 9 శాతం ఎక్కువగా ఉన్నాయని, జూన్ 2023లో ఫుల్ క్రీమ్ మిల్క్ ధరలు ఏడాది కంటే 10 శాతం ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది.
Read Also:Jailer: ‘జైలర్’కి సూపర్ హిట్ టాక్.. నెల్సన్ ను కలిసి కంగ్రాట్స్ చెప్పిన సీఎం
Also Read
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మంత్రి రూపాలా పార్లమెంటు ఎగువ సభలో ఎన్డిడిబి డేటాను వెల్లడించారు. గత మూడేళ్లలో పాల ధరలు పెద్దగా పెరగలేదని చెప్పారు. జాతీయ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి అందిన సమాచారం ప్రకారం గత మూడేళ్లుగా పాల ధరలు పెద్దగా పెరగలేదన్నారు. గత ఏడాది గణాంకాలు భిన్నమైన లెక్కలను అందిస్తున్నాయి. జూన్ 2022లో టోన్డ్ మిల్క్ ధర లీటరుకు రూ. 47.4 ఇప్పుడు టోన్డ్ మిల్క్ లీటరు రూ.51.6గా మారింది. ఈ విధంగా టోన్డ్ మిల్క్ ధరలు ఏడాదిలో 8.86 శాతం పెరిగాయి. మరోవైపు, ఫుల్ క్రీమ్ మిల్క్ విషయానికొస్తే జూన్ 2022లో లీటరుకు రూ.58.8గా ఉన్న ధరతో పోలిస్తే లీటరుకు 9.86 శాతం పెరిగి రూ.64.6కి చేరుకుంది.
Read Also:Infosys Narayana Murthy: ఇండియాలో జనాభా నియంత్రణ అవసరం
దేశంలో పాల ధరలను పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ నియంత్రించడం లేదని మంత్రి పార్లమెంటుకు తెలిపారు. దేశంలో పాల కొనుగోలు, అమ్మకాలపై ప్రభుత్వం నియంత్రణ లేదని అన్నారు. దీని ధరలను సహకార, ప్రైవేట్ డెయిరీలు వాటి ధర, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయిస్తాయి. గత కొన్ని నెలలుగా దేశంలో అనేక ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. టమాటా పలు నగరాల్లో కిలో ధర రూ.200 దాటడంతో రూ.300 వరకు వెళ్లే అవకాశం ఉంది. కూరగాయలు కూడా చాలా ఖరీదైనవి. మసాలా దినుసుల ధరలు కూడా మండి పడ్డాయి. ఇప్పుడు వచ్చే 1-2 నెలల్లో ఉల్లి ధరలు రెట్టింపు అవుతాయని సామాన్యులు భయపడుతున్నారు.
తాజావార్తలు
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
-
JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?