Milk Price Hike: మండుతున్న నిత్యావసరాల ధరలు.. ఏడాదిలో 10శాతం పెరిగిన పాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Milk Price Hike: ద్రవ్యోల్బణం కారణంగా దేశవ్యాప్తంగా సామాన్యుల తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం సామాన్యుల జీవనాన్ని అతలాకుతలం చేసింది. కొంతకాలంగా టమాటా, కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకాయి. మరోవైపు పాల ధర కూడా భారీగా పెరిగింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత ఏడాది కాలంలో పాల ధర 10 శాతం వరకు పెరిగింది. ఈ ఏడాది జూన్లో టోన్డ్ మిల్క్ ధరలు ఏడాది క్రితం అంటే 2022 జూన్లో 9 శాతం ఎక్కువగా ఉన్నాయని, జూన్ 2023లో ఫుల్ క్రీమ్ మిల్క్ ధరలు ఏడాది కంటే 10 శాతం ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది.
Read Also:Jailer: ‘జైలర్’కి సూపర్ హిట్ టాక్.. నెల్సన్ ను కలిసి కంగ్రాట్స్ చెప్పిన సీఎం
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మంత్రి రూపాలా పార్లమెంటు ఎగువ సభలో ఎన్డిడిబి డేటాను వెల్లడించారు. గత మూడేళ్లలో పాల ధరలు పెద్దగా పెరగలేదని చెప్పారు. జాతీయ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి అందిన సమాచారం ప్రకారం గత మూడేళ్లుగా పాల ధరలు పెద్దగా పెరగలేదన్నారు. గత ఏడాది గణాంకాలు భిన్నమైన లెక్కలను అందిస్తున్నాయి. జూన్ 2022లో టోన్డ్ మిల్క్ ధర లీటరుకు రూ. 47.4 ఇప్పుడు టోన్డ్ మిల్క్ లీటరు రూ.51.6గా మారింది. ఈ విధంగా టోన్డ్ మిల్క్ ధరలు ఏడాదిలో 8.86 శాతం పెరిగాయి. మరోవైపు, ఫుల్ క్రీమ్ మిల్క్ విషయానికొస్తే జూన్ 2022లో లీటరుకు రూ.58.8గా ఉన్న ధరతో పోలిస్తే లీటరుకు 9.86 శాతం పెరిగి రూ.64.6కి చేరుకుంది.
Read Also:Infosys Narayana Murthy: ఇండియాలో జనాభా నియంత్రణ అవసరం
దేశంలో పాల ధరలను పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ నియంత్రించడం లేదని మంత్రి పార్లమెంటుకు తెలిపారు. దేశంలో పాల కొనుగోలు, అమ్మకాలపై ప్రభుత్వం నియంత్రణ లేదని అన్నారు. దీని ధరలను సహకార, ప్రైవేట్ డెయిరీలు వాటి ధర, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయిస్తాయి. గత కొన్ని నెలలుగా దేశంలో అనేక ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. టమాటా పలు నగరాల్లో కిలో ధర రూ.200 దాటడంతో రూ.300 వరకు వెళ్లే అవకాశం ఉంది. కూరగాయలు కూడా చాలా ఖరీదైనవి. మసాలా దినుసుల ధరలు కూడా మండి పడ్డాయి. ఇప్పుడు వచ్చే 1-2 నెలల్లో ఉల్లి ధరలు రెట్టింపు అవుతాయని సామాన్యులు భయపడుతున్నారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!