India-Maldives: మాల్దీవులకు మరో దెబ్బ.. 22 శాతం సాయాన్ని తగ్గించిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Maldives: మాల్దీవులు, ఇండియా మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. కొత్తగా ఎన్నికైన ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, ప్రో చైనా వైఖరని కనబరుస్తున్నాడు. నిజానికి ఎన్నికైనా ఏ అధ్యక్షుడైనా మొదటగా భారతదేశంలో పర్యటిస్తారు. అయితే, ముయిజ్జూ మాత్రం చైనా పర్యటనకు వెళ్లాడు. భారత ప్రధాని మోడీ లక్షద్వీప్ సందర్శించడంతో ఒక్కసారిగా అక్కడి మంత్రులు ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత పెద్దదైంది. ముగ్గురు మంత్రులను ప్రభుత్వం నుంచి సస్పెండ్ చేసినప్పటికీ.. భారత్ ప్రజలు ‘‘బాయ్కాట్ మాల్దీవ్స్’’ అంటూ ఆ దేశాన్ని బహిష్కరించారు. గతంలో మాల్దీవులను సందర్శించే టూరిస్టుల్లో మొదటిస్థానంలో ఉండే భారత్, ఇప్పుడు 5వ స్థానానికి పడిపోయింది. దీంతో మాల్దీవులు పీకల్లోతు కష్టాల్లో ఉంది.
Read Also: Delhi Crime: ఇన్స్టాగ్రామ్లో పరిచయం.. మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారం..
Also Read
- Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
- Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్ను చంపింది మేమే.. గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
- Ajit Doval: అరుణాచల్లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
- Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
ఇదిలా ఉంటే మాల్దీవ్స్కి ఇండియా మరో షాక్ ఇచ్చింది. గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి మాల్దీవులకు 22 శాతం సాయాన్ని తగ్గించాలని భారత్ ప్రతిపాదించింది. మాల్దీవుల అభివృద్ధికి రూ.600 కోట్లను మాత్రమే కేటాయించారు. 2023-24లో మాల్దీవులకు సహాయంగా రూ.770.90 కోట్లు అందించారు. వాస్తవానికి, 2023 బడ్జెట్లో మాల్దీవుల కోసం ప్రభుత్వం మొదట రూ.400 కోట్లు కేటాయించింది. తర్వాత దానిని రూ.770.90 కోట్లకు సవరించింది. భారత్ ఆ దేశానికి రక్షణ, విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌళిక సదుపాయాల వంటి రంగాల్లో సాయం చేస్తోంది.
ఒక్క మాల్దీవులకు కాదు, భారత్ విదేశాలకు అందిస్తున్న సాయాన్ని ఈ సారి తగ్గించింది. భారతదేశం 2024-25 కోసం విదేశీ దేశాలకు సహాయంగా రూ. 4883.56 కోట్లు కేటాయించింది, ఇది 2023-24లో బడ్జెట్ చేసిన 5426.78 కోట్ల నుండి తగ్గింది. భూటాన్, నేపాల్ దేశాలకు గ్రాంట్లను పెంచింది. భూటాన్కు అభివృద్ధి సహాయం కోసం రూ.2068.56 కోట్లు కేటాయించగా, నేపాల్కు రూ.700 కోట్లు కేటాయించారు. కేటాయింపులు తగ్గించబడిన ఇతర దేశాలలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ మరియు లాటిన్ అమెరికా దేశాలు ఉన్నాయి. మరోవైపు శ్రీలంక, ఆఫ్రికా దేశాలు, మారిషస్, సీషెల్స్లకు బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి.
తాజావార్తలు
-
Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
-
Karumuri Nageswara Rao : ఏపీ లిక్కర్ రవాణా స్కామ్లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
-
Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
-
Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్ను చంపింది మేమే.. గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
-
Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!