India-Maldives: మాల్దీవులకు మరో దెబ్బ.. 22 శాతం సాయాన్ని తగ్గించిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Maldives: మాల్దీవులు, ఇండియా మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. కొత్తగా ఎన్నికైన ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, ప్రో చైనా వైఖరని కనబరుస్తున్నాడు. నిజానికి ఎన్నికైనా ఏ అధ్యక్షుడైనా మొదటగా భారతదేశంలో పర్యటిస్తారు. అయితే, ముయిజ్జూ మాత్రం చైనా పర్యటనకు వెళ్లాడు. భారత ప్రధాని మోడీ లక్షద్వీప్ సందర్శించడంతో ఒక్కసారిగా అక్కడి మంత్రులు ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత పెద్దదైంది. ముగ్గురు మంత్రులను ప్రభుత్వం నుంచి సస్పెండ్ చేసినప్పటికీ.. భారత్ ప్రజలు ‘‘బాయ్కాట్ మాల్దీవ్స్’’ అంటూ ఆ దేశాన్ని బహిష్కరించారు. గతంలో మాల్దీవులను సందర్శించే టూరిస్టుల్లో మొదటిస్థానంలో ఉండే భారత్, ఇప్పుడు 5వ స్థానానికి పడిపోయింది. దీంతో మాల్దీవులు పీకల్లోతు కష్టాల్లో ఉంది.
Read Also: Delhi Crime: ఇన్స్టాగ్రామ్లో పరిచయం.. మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారం..
Also Read
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
ఇదిలా ఉంటే మాల్దీవ్స్కి ఇండియా మరో షాక్ ఇచ్చింది. గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి మాల్దీవులకు 22 శాతం సాయాన్ని తగ్గించాలని భారత్ ప్రతిపాదించింది. మాల్దీవుల అభివృద్ధికి రూ.600 కోట్లను మాత్రమే కేటాయించారు. 2023-24లో మాల్దీవులకు సహాయంగా రూ.770.90 కోట్లు అందించారు. వాస్తవానికి, 2023 బడ్జెట్లో మాల్దీవుల కోసం ప్రభుత్వం మొదట రూ.400 కోట్లు కేటాయించింది. తర్వాత దానిని రూ.770.90 కోట్లకు సవరించింది. భారత్ ఆ దేశానికి రక్షణ, విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌళిక సదుపాయాల వంటి రంగాల్లో సాయం చేస్తోంది.
ఒక్క మాల్దీవులకు కాదు, భారత్ విదేశాలకు అందిస్తున్న సాయాన్ని ఈ సారి తగ్గించింది. భారతదేశం 2024-25 కోసం విదేశీ దేశాలకు సహాయంగా రూ. 4883.56 కోట్లు కేటాయించింది, ఇది 2023-24లో బడ్జెట్ చేసిన 5426.78 కోట్ల నుండి తగ్గింది. భూటాన్, నేపాల్ దేశాలకు గ్రాంట్లను పెంచింది. భూటాన్కు అభివృద్ధి సహాయం కోసం రూ.2068.56 కోట్లు కేటాయించగా, నేపాల్కు రూ.700 కోట్లు కేటాయించారు. కేటాయింపులు తగ్గించబడిన ఇతర దేశాలలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ మరియు లాటిన్ అమెరికా దేశాలు ఉన్నాయి. మరోవైపు శ్రీలంక, ఆఫ్రికా దేశాలు, మారిషస్, సీషెల్స్లకు బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి.
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!