BSF: పాకిస్థాన్ ‘డ్రోన్’ కుట్ర.. 6 నెలల్లో 126 డ్రోన్లు కూల్చేసిన బీఎస్ఎఫ్
- భారత్పై పాకిస్థాన్ కుట్రలు
- ఒకవైపు సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను పంపుతున్న పాక్
- మరోవైపు డ్రోన్స్ సాయంతో డ్రగ్స్..ఆయుధాలు.. మందుగుండు సామగ్రి.. నకిలీ కరెన్సీ సరఫరాకు యత్నం
- దుర్మార్గపు కుట్రలను భగ్నం చేస్తున్న బీఎస్ఎఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్పై పాకిస్థాన్ కుట్రలు కొనసాగిస్తోంది. ఒకవైపు సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను పంపిస్తూనే మరోవైపు డ్రోన్ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నకిలీ కరెన్సీని సరిహద్దు ప్రాంతాలకు పంపిస్తోంది. కానీ సరిహద్దులో మోహరించిన బీఎస్ఎఫ్ సైనికులు నిరంతరం దుర్మార్గపు కుట్రలను భగ్నం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జులై 9 మధ్య పంజాబ్-పాకిస్థాన్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ 126 డ్రోన్లను కూల్చివేసింది. అయితే 2023లో ఈ డ్రోన్లు/యూఏవీల సంఖ్య 107గా ఉంది.
READ MORE: NEET-UG paper leak: నీట్-యూజీ పేపర్ లీకులో మరో సూత్రధారి అరెస్ట్..
Also Read
- Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
- Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
- Abhijeet Dipke: త్వరలో జంతర్మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
- Police Lathi Testing: పోలీసుల "లాఠీ"లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
బీఎస్ఎఫ్ “ఎక్స్” లో ఈ వివరాలను పంచుకుంది. ఇది అసాధారణ ప్రదర్శనగా అభివర్ణిస్తూ.. దేశ భద్రతలో బీఎస్ఎఫ్ పంజాబ్ అంకితభావంతో మరియు సమర్ధవంతంగా పనిచేస్తుందని రాసుకొచ్చింది. డ్రోన్ల ద్వారా పంజాబ్ సరిహద్దు ప్రాంతాలకు డ్రగ్స్, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నకిలీ కరెన్సీలను పాకిస్థాన్ పంపుతుంది. దీని ద్వారా భారత్లో డ్రగ్స్ వ్యాపారం, ఉగ్రవాదాన్ని పెంచాలని భావిస్తోంది. అంతేకాకుండా డ్రోన్ల ద్వారా సరిహద్దుల్లో గూఢచర్యం చేసేందుకు కూడా పాక్ యత్నిస్తోంది. ఈ ఏడాది 126 డ్రోన్లతో పాటు 150 కిలోల హెరాయిన్, 18 ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ తన పోస్ట్లో పేర్కొంది. ఇది కాకుండా, ఒక పాకిస్థానీ చొరబాటుదారుని హతమార్చింది. అంతర్జాతీయ సరిహద్దును దాటడానికి ప్రయత్నిస్తున్న 21 మందిని అరెస్టు చేసింది.
READ MORE: OLA: మహిళతో ఓలా ఆటో డ్రైవర్ దురుసు ప్రవర్తన..ఎక్స్ ఖాతాలో పంచుకున్న బాధితురాలు
పాకిస్థాన్ ఏయే ప్రాంతాలకు డ్రోన్లను పంపుతుంది?
పంజాబ్ గురించి మాట్లాడితే.. అంతర్జాతీయ సరిహద్దు జిల్లాల్లో పాకిస్థాన్ డ్రోన్లు తరచుగా కనిపిస్తాయి. వీటిలో ఫిరోజ్పూర్, గురుదాస్పూర్, తరన్ తరణ్, అమృత్సర్ మరియు పఠాన్కోట్ ఉన్నాయి. పాకిస్థానీ డ్రోన్లు ఈ ప్రాంతాలకు డ్రగ్స్ సరుకులను తీసుకువస్తాయి. అదే సమయంలో, పూంచ్, రాజౌరి మరియు సాంబాతో సహా జమ్మూ కాశ్మీర్లోని అనేక ప్రాంతాలలోడ్రోన్లు చొరబాటుకు ప్రయత్నిస్తున్నాయి.
తాజావార్తలు
-
Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
-
CM Revanth Reddy : మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
-
Abhijeet Dipke: త్వరలో జంతర్మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..