KTR: ఈవీఎం వద్దు.. బ్యాలెట్ పేపర్ ముద్దు
- బీహార్ లో జరిగిన లోపాలను అరికట్టకపోతే, రేపు తెలంగాణలో జరిగే ప్రమాదం ఉంది
- బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే బ్యాలెట్ విధానం తీసుకురావాలి
- కార్ గుర్తును పోలిన గుర్తులను తక్షణమే తొలగించాలి
- కేంద్ర ఎన్నికల సంఘంతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ – భారతదేశంలో ఇకపైన జరిగే ప్రతి ఎన్నిక బ్యాలెట్ పేపర్ విధానంలోనే జరగాలని డిమాండ్ చేశారు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బ్యాలెట్ విధానాన్ని బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే ప్రవేశపెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేటీఆర్ కోరారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు బిఆర్ఎస్ నేతల బృందం కేటీఆర్ నేతృత్వంలో ఈసీ అధికారులతో సమావేశం అయింది. దేశంలో ఎన్నికల వ్యవస్థ, నూతన సంస్కరణలు, ఎన్నికల నియమావళి వంటి అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తుంది. అందులో బాగానే టిఆర్ఎస్ పార్టీని సమావేశానికి ఆహ్వానించింది.
Also Read:Travel Loan: జల్సాలకు లోన్ తీసుకుంటున్న యువత.. సర్వేలో సంచలన విషయాలు..!
Also Read
- Rajat Patidar: ధోనీ, రోహిత్కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
- RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
- IPL 2026 Awards Winners List: వైభవ్ సూర్యవంశీ హవా.. ఐపీఎల్ 2026లో అవార్డ్స్ గెలుచుకున్న స్టార్ ప్లేయర్స్ వీరే..!
- Anushka Sharma: విరాట్ ఫినిష్ ఆఫ్ ఇట్స్ స్టైల్.. అనుష్క శర్మ రియాక్షన్ మాములుగా లేదుగా.!
కేంద్ర ఎన్నికల సంఘంతో జరిగిన సమావేశంలో బిఆర్ఎస్ బృందం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నాయని గుర్తుచేసింది.. భారత్ లో ఈవీఎంల ద్వారా జరుగుతున్న ఎన్నికల పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో, ఈవీఎంలను పక్కనపెట్టి బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలని కోరారు. నవంబర్ లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు కేటీఆర్ తెలిపారు. అంతేకాదు ఎన్నికలు వస్తే చాలు రాజకీయ పార్టీలు అడ్డగోలు వాగ్దానాలు చేస్తున్నాయని, వాటిని అధికారంలోకి వచ్చాక అమలు చేయకపోతే చర్యలు కూడా తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది బిఆర్ఎస్.
Also Read:Uttarakhand Floods: ఉత్తర కాశీ జిల్లాలో వరద బీభత్సం.. 60 మందికి పైగా గల్లంతు!
మరోపక్క బీహార్ లో జరిగిన ఓట్ల జాబితా సమగ్ర సర్వేపై కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించినట్టు తెలిపారు. ముఖ్యంగా ఓట్లు తొలగించేటటువంటి ప్రక్రియను బూత్ స్థాయి నుంచి అన్ని రాజకీయ పార్టీలను అఖిలపక్షంగా ఏర్పాటు చేసి పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అనర్హుడికి ఒక ఓటు వచ్చినా సరే, ఏ ఒక్క అర్హుడు కూడా ఓటు కోల్పో వద్దన్నారు కేటీఆర్. ఎన్నికల గుర్తులు నుంచి తమ పార్టీ సింబల్ అయిన కార్ గుర్తును పోలి ఉన్న గుర్తులను తక్షణమే తొలగించాలని.. గతంలో జరిగిన పలు ఎన్నికల్లో పోలివున్న గుర్తులవల్ల తమ పార్టీ అభ్యర్థులు నష్టపోయారని కేటీఆర్ గుర్తు చేశారు..
తాజావార్తలు
-
Sobhita dhulipala : ప్రళయానంతర ప్రపంచంలో కథ… ‘వెట్టువం’పై అంచనాలు పెంచిన శోభిత కామెంట్స్
-
Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
-
Rajat Patidar: ఆర్సీబీ కెప్టెన్గా ట్రోఫీ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు.. ఇదంతా విధి రాసిందే!
-
Shubman Gill: కచ్చితంగా గెలుస్తామనుకున్నాం.. కానీ అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది!
-
Venkatesh iyer: కుంటుకుంటూ.. రెచ్చిపోతూ.. RCBకి కప్ తెచ్చిన సూపర్ డూపర్ హీరో.. ఫైనల్ అంటేనే రెచ్చిపోయే ప్లేయర్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!