Uttarakhand Floods: ఉత్తర కాశీ జిల్లాలో వరద బీభత్సం.. 60 మందికి పైగా గల్లంతు!
- ఉత్తర కాశీ జిల్లాలో బీభత్సం సృష్టించిన వరదలు..
- ధరాలీ గ్రమాన్ని ముంచెత్తిన వరదలు, 60 మందికి పైగా గల్లంతు..
- కుప్పకూలిన ఇళ్లు, శిథిలాల కింద పలువురు..
- ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు..
- ఒక్కసారిగా ఖీర్గధ్ గ్రామాన్ని ముంచెత్తిన వరద.. నలుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand Floods: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో మెరుపు వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. ధరాలీ గ్రామంపై జలప్రవాహం ఒక్కసారిగా విరుచుకుపడటంతో.. ఇప్పటి వరకు నలుగురు చనిపోయినట్లు సమాచారం. దాదాపు 60 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని తెలుస్తుంది. అయితే, 20-25 హోటళ్లు, ఇళ్లు వరకు కొట్టుకుపోయి ఉండొచ్చని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతమైన ఖీర్గఢ్ నుంచి పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి నిమిషాల్లోనే చేరుకున్నట్లు తెలుస్తుంది. సహాయక చర్యల కోసం ఉత్తరాఖండ్ సర్కార్ ఇండియన్క ఆర్మీని అలర్ట్ చేసింది. ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ బృందాలు ఘటనా ప్రదేశంలో సహాయక చర్యలకు చేపట్టినట్లు సమాచారం.
Read Also: Screenshot History: స్క్రీన్షాట్ ఫీచర్ను ఎవరు కనుగొన్నారో తెలుసా..? ఆసక్తికర విషయాలు…
Also Read
అయితే, ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరకాశీలోని ధరాలీలో వరద సృష్టించిన బీభత్సం అనే వార్త చాలా బాధాకరమన్నారు. పరిస్థితిని క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితులకు అన్ని రకాలుగా అండగా సాయం చేస్తామన్నారు. ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ఆ దేవుడి కోరుకుంటున్నాను అని చెప్పారు. మరోవైపు.. ఈ ఘటనపై సీఎం ధామీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి స్థానిక పరిస్థితులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.
తాజావార్తలు
-
Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
-
Pakistan: పాకిస్థాన్ డబుల్ గేమ్.. మధ్యవర్తిత్వం పేరుతో ట్రంప్ను ఇలా మోసం చేశారేంట్రా బాబు!
-
Ravi Teja : ‘ఇరుముడి’ తర్వాత రవితేజ డబుల్ ట్రీట్..
-
Shreyas Iyer: పొరపాట్లు చేశా, సరైన ప్లానింగ్ లేదు.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్!
-
NTRNEEL : నందమూరి ఫ్యాన్స్కు మిడ్ నైట్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?