Uttarakhand Floods: ఉత్తర కాశీ జిల్లాలో వరద బీభత్సం.. 60 మందికి పైగా గల్లంతు!
- ఉత్తర కాశీ జిల్లాలో బీభత్సం సృష్టించిన వరదలు..
- ధరాలీ గ్రమాన్ని ముంచెత్తిన వరదలు, 60 మందికి పైగా గల్లంతు..
- కుప్పకూలిన ఇళ్లు, శిథిలాల కింద పలువురు..
- ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు..
- ఒక్కసారిగా ఖీర్గధ్ గ్రామాన్ని ముంచెత్తిన వరద.. నలుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand Floods: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో మెరుపు వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. ధరాలీ గ్రామంపై జలప్రవాహం ఒక్కసారిగా విరుచుకుపడటంతో.. ఇప్పటి వరకు నలుగురు చనిపోయినట్లు సమాచారం. దాదాపు 60 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని తెలుస్తుంది. అయితే, 20-25 హోటళ్లు, ఇళ్లు వరకు కొట్టుకుపోయి ఉండొచ్చని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతమైన ఖీర్గఢ్ నుంచి పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి నిమిషాల్లోనే చేరుకున్నట్లు తెలుస్తుంది. సహాయక చర్యల కోసం ఉత్తరాఖండ్ సర్కార్ ఇండియన్క ఆర్మీని అలర్ట్ చేసింది. ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ బృందాలు ఘటనా ప్రదేశంలో సహాయక చర్యలకు చేపట్టినట్లు సమాచారం.
Read Also: Screenshot History: స్క్రీన్షాట్ ఫీచర్ను ఎవరు కనుగొన్నారో తెలుసా..? ఆసక్తికర విషయాలు…
Also Read
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది.. ఇరాన్పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
- US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
- Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
- El Nino: ఎల్నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
అయితే, ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరకాశీలోని ధరాలీలో వరద సృష్టించిన బీభత్సం అనే వార్త చాలా బాధాకరమన్నారు. పరిస్థితిని క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితులకు అన్ని రకాలుగా అండగా సాయం చేస్తామన్నారు. ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ఆ దేవుడి కోరుకుంటున్నాను అని చెప్పారు. మరోవైపు.. ఈ ఘటనపై సీఎం ధామీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి స్థానిక పరిస్థితులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!