Uttarakhand Floods: ఉత్తర కాశీ జిల్లాలో వరద బీభత్సం.. 60 మందికి పైగా గల్లంతు!
- ఉత్తర కాశీ జిల్లాలో బీభత్సం సృష్టించిన వరదలు..
- ధరాలీ గ్రమాన్ని ముంచెత్తిన వరదలు, 60 మందికి పైగా గల్లంతు..
- కుప్పకూలిన ఇళ్లు, శిథిలాల కింద పలువురు..
- ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు..
- ఒక్కసారిగా ఖీర్గధ్ గ్రామాన్ని ముంచెత్తిన వరద.. నలుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand Floods: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో మెరుపు వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. ధరాలీ గ్రామంపై జలప్రవాహం ఒక్కసారిగా విరుచుకుపడటంతో.. ఇప్పటి వరకు నలుగురు చనిపోయినట్లు సమాచారం. దాదాపు 60 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని తెలుస్తుంది. అయితే, 20-25 హోటళ్లు, ఇళ్లు వరకు కొట్టుకుపోయి ఉండొచ్చని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతమైన ఖీర్గఢ్ నుంచి పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి నిమిషాల్లోనే చేరుకున్నట్లు తెలుస్తుంది. సహాయక చర్యల కోసం ఉత్తరాఖండ్ సర్కార్ ఇండియన్క ఆర్మీని అలర్ట్ చేసింది. ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ బృందాలు ఘటనా ప్రదేశంలో సహాయక చర్యలకు చేపట్టినట్లు సమాచారం.
Read Also: Screenshot History: స్క్రీన్షాట్ ఫీచర్ను ఎవరు కనుగొన్నారో తెలుసా..? ఆసక్తికర విషయాలు…
Also Read
- Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
- Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
- Telegram Banned: నీట్ రీ-ఎగ్జామ్ వరకు టెలిగ్రామ్ బ్యాన్.. స్పందించిన సీఈఓ పావెల్ దురోవ్..
- Twisha Sharma: ‘అవి మాకు పూర్తిగా కావాలి’.. కోర్టులో ట్విషా శర్మ అత్తగారు వింత వాదన
అయితే, ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరకాశీలోని ధరాలీలో వరద సృష్టించిన బీభత్సం అనే వార్త చాలా బాధాకరమన్నారు. పరిస్థితిని క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితులకు అన్ని రకాలుగా అండగా సాయం చేస్తామన్నారు. ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ఆ దేవుడి కోరుకుంటున్నాను అని చెప్పారు. మరోవైపు.. ఈ ఘటనపై సీఎం ధామీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి స్థానిక పరిస్థితులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?