BRS : వరంగల్లోఈ సాయంత్రం జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకి తరలి వెళ్తున్న ప్రైవేటు వాహనాలని పలు చోట్ల రోడ్ ట్రాన్స్ పోర్ట్ అధికారులు నిలిపివేస్తునారు.. అధికారుల వైఖరి నిరసిస్తూ బి ఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గంలో బస్సుల నిలిపివేత ఎక్కువగా జరిగింది. ప్రైవేటు స్కూల్ బస్సులు అదేవిధంగా ప్రైవేటు యాజమాన్యం లోని బస్సులను యాజమాన్యాలకి ఆర్టీవో కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లి వెళ్ళాయి . స్కూల్ బస్సులు కార్యక్రమానికి వినియోగించడం సరైన చర్య కాదని ఆర్టీవో అధికారుల నుంచి హెచ్చరికలు వెళ్లాయి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఆర్టీవో ఉన్నతాధికారుల తో మాట్లాడారు.
అయితే తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆర్టీవో ఉన్నతాధికారులు చెబుతుండగా ఆదేశాలు వచ్చాయని జిల్లాకి చెందిన ఆర్టీవో అధికారులు అంటున్నారు. అటు విఆర్ఎస్ నాయకులకి సర్ది చెప్పలేక ఉన్నతాధికారి నుంచి వచ్చిన అనధికారిక ఆదేశాలను అమలు చేయలేక ఆర్టీవో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలయపాలెం వద్ద ఆపిన వాహనాలను అక్కడే బిఆర్ఎస్ నాయకులు ఉండి వరంగల్ కి పంపిస్తున్నారు.