తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలనం సృష్టించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై “మైడియర్ డాడీ” అంటూ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు ఆరు పేజీల లేఖ రాశారు. పార్టీ లీడర్స్కు యాక్సెస్ ఇవ్వడం లేదంటూ కవిత ఆరోపణ చేశారు.. బీజేపీతో పొత్తుపై కూడా సిల్వర్ జూబ్లీ సభలో క్లారిటీ ఇవ్వలేదని ప్రశ్నించారు.. పాజిటివ్, నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ వివరంగా లేఖలో పేర్కొన్నారు. పాజిటివ్, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ వివరంగా లేఖ రాశారు కవిత.
READ MORE: Bangladesh: మహ్మద్ యూనస్కి ఆర్మీ చీఫ్ వార్నింగ్.. “రఖైన్ కారిడార్”పై విభేదాలు..
బీజేపీపై 2 నిమిషాలే మాట్లాడటంపై అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ వల్ల తాను చాలా బాధపడ్డానని పేర్కొన్నారు. బీజేపీని టార్గెట్ చేసి ఉంటే బాగుండేదని ఆశాభావం వ్యక్తం చేశారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చామన్న మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లిందని.. ఈ పొలిటికల్ సినారియోను అడ్రెస్ చేయడానికి స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ గైడ్ లైన్స్ ఇస్తారని అంతా భావించారన్నారు. ఇప్పటికైనా 1-2 ప్లీనరీ పెట్టాలని కోరారు. ఎస్సీ వర్గీకరణపై ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, తెలంగాణ గీతం, మోటీవేట్ చేస్తారని ఎదురు చూశారన్నారు. ఓరాల్గా ఇంకొంచెం పంచ్ ఎక్స్పెక్ట్ చేశారు. పార్టీ లీడర్స్కి యాక్సిస్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాత ఇన్ఛార్జ్లకే లోక్ బాడీ బీఫాం ఇస్తారా? 2001 నుంచి పార్టీలో ఉన్న వారిని వేదికపై మాట్లాడనివ్వరా? అని అని అడిగారు. వక్ఫ్ బిల్లుపై మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. బీసీలకు 42 శాతం కటా అంశాన్ని విస్మరించారని పేర్కొన్నారు.