KCR: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..! ఏ రోజంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR: ముహూర్తం రానే వచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేందుకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేసేందుకు ముహూర్తం ఖరారైనట్లు బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. దీంతో ఫిబ్రవరి 1న కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీకి నవంబర్లో ఎన్నికలు జరిగాయి, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడ్డాయి. ప్రొ-టర్మ్ స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన డిసెంబర్ 9న మెజారిటీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, డిసెంబర్ 8న మెదక్లోని ఎర్రవల్లి ఫామ్హౌస్లోని వాష్రూమ్లో జారిపడి తుంటి ఎముక విరగడంతో కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం యశోద ఆస్పత్రిలో చేరారు, అక్కడ శస్త్రచికిత్స కూడా చేశారు. ఇప్పుడు , కేసీఆర్ కోలుకుంటున్నారని, త్వరలో తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారనున్నారు.
Read also: BJP MLA Ramana Reddy: సార్ మీకు సలామ్.. మాటకోసం సొంతింటినే కూల్చేసిన బీజేపీ ఎమ్మెల్యే
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఆ పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. దాదాపు 3 గంటల పాటు సమావేశం జరిగింది. బీఆర్ఎస్ ఎంపీలు ఉభయ సభల్లో ఆర్భాటంగా మాట్లాడాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉందని…త్వరలో తాను కూడా ప్రజల్లోకి వస్తానని చెప్పారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక శక్తి బీఆర్ఎస్ పార్టీ అని… రానున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ ఎంపీలు గళం విప్పాలని ఆదేశించారు. నదీజలాల కేటాయింపు, ఉమ్మడి ఆస్తుల బదలాయింపుతోపాటు రాష్ట్ర విభజన పెండింగ్ హామీల అమలు కోసం పోరాడిన చరిత్ర బీఆర్ ఎస్ పార్టీకి ఉందన్నారు. తెలంగాణ హక్కులను అడ్డుకుని కాపాడాల్సిన బాధ్యత మరోసారి బీఆర్ఎస్ ఎంపీలపైనే ఉందని స్పష్టం చేశారు.
Read also: Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో తగ్గుతున్న చలి.. ఐఎండీ వెల్లడి
నవంబర్ 30, 2023న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 39 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఈ ఎన్నికల్లో మరోసారి గజ్వేల్ నుంచి పోటీ చేసిన కేసీఆర్ 45,031 ఓట్ల తేడాతో గెలుపొందారు. బీజేపీ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్ రెండో స్థానంలో నిలిచారు. అదే ఎన్నికల్లో కామారెడ్డిలో పోటీ చేసిన కేసీఆర్ బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక్కడ రెండో స్థానంలో నిలిచాడు.
Minister Seethakka: ములుగులో సీతక్క పర్యటన.. మేడారం జాతర పనుల పరిశీలన
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!