KCR: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..! ఏ రోజంటే..?
KCR: ముహూర్తం రానే వచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేందుకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేసేందుకు ముహూర్తం ఖరారైనట్లు బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. దీంతో ఫిబ్రవరి 1న కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీకి నవంబర్లో ఎన్నికలు జరిగాయి, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడ్డాయి. ప్రొ-టర్మ్ స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన డిసెంబర్ 9న మెజారిటీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, డిసెంబర్ 8న మెదక్లోని ఎర్రవల్లి ఫామ్హౌస్లోని వాష్రూమ్లో జారిపడి తుంటి ఎముక విరగడంతో కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం యశోద ఆస్పత్రిలో చేరారు, అక్కడ శస్త్రచికిత్స కూడా చేశారు. ఇప్పుడు , కేసీఆర్ కోలుకుంటున్నారని, త్వరలో తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారనున్నారు.
Read also: BJP MLA Ramana Reddy: సార్ మీకు సలామ్.. మాటకోసం సొంతింటినే కూల్చేసిన బీజేపీ ఎమ్మెల్యే
Also Read
తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఆ పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. దాదాపు 3 గంటల పాటు సమావేశం జరిగింది. బీఆర్ఎస్ ఎంపీలు ఉభయ సభల్లో ఆర్భాటంగా మాట్లాడాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉందని…త్వరలో తాను కూడా ప్రజల్లోకి వస్తానని చెప్పారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక శక్తి బీఆర్ఎస్ పార్టీ అని… రానున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ ఎంపీలు గళం విప్పాలని ఆదేశించారు. నదీజలాల కేటాయింపు, ఉమ్మడి ఆస్తుల బదలాయింపుతోపాటు రాష్ట్ర విభజన పెండింగ్ హామీల అమలు కోసం పోరాడిన చరిత్ర బీఆర్ ఎస్ పార్టీకి ఉందన్నారు. తెలంగాణ హక్కులను అడ్డుకుని కాపాడాల్సిన బాధ్యత మరోసారి బీఆర్ఎస్ ఎంపీలపైనే ఉందని స్పష్టం చేశారు.
Read also: Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో తగ్గుతున్న చలి.. ఐఎండీ వెల్లడి
నవంబర్ 30, 2023న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 39 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఈ ఎన్నికల్లో మరోసారి గజ్వేల్ నుంచి పోటీ చేసిన కేసీఆర్ 45,031 ఓట్ల తేడాతో గెలుపొందారు. బీజేపీ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్ రెండో స్థానంలో నిలిచారు. అదే ఎన్నికల్లో కామారెడ్డిలో పోటీ చేసిన కేసీఆర్ బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక్కడ రెండో స్థానంలో నిలిచాడు.
Minister Seethakka: ములుగులో సీతక్క పర్యటన.. మేడారం జాతర పనుల పరిశీలన
తాజావార్తలు
-
Salil Aarora: SRH కు మరో కాటేరమ్మ కొడుకు.. సలీల్ అరోరా ఎవరు..? చరిత్ర చూస్తే పూనకాలే..
-
DJ Sound: డీజే సౌండ్కు 140 కోళ్లు బలి.. కేసు నమోదు..
-
Rishabh Pant: టీమిండియాలో వికెట్ కీపర్ రేస్ హీట్.. రిషబ్ పంత్కు బిగ్ షాక్!
-
Tollywood Star Heroine: అవార్డులా? మాకొద్దు.. డబ్బుంటే పంపండి.. స్టార్ హీరోయిన్ తండ్రి సంచలనం!
-
Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!