Minister Seethakka: ములుగులో సీతక్క పర్యటన.. మేడారం జాతర పనుల పరిశీలన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka:పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇవాళ ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారు. వివిధ అభివృద్ధి పనులలో పాల్గొనడంతో పాటు, పలు గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించనున్నారు. ములుగు ఇంచెర్ల గ్రామంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ అభినందన సభలో మంత్రి పాల్గొంటారు. అనంతరం మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో భాగంగా పనులను పరిశీలిస్తారు. అక్కడి నుంచి రోడ్డు గుండా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలోని గోవిందరాజుల ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
Read also: Pending Challans: మూడురోజులే గడువు.. పెండింగ్ చలాన్లు కట్టని వారు కట్టేయండి బాబు..
Also Read
- Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
- Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
- Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
- TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
మేడారం మహాజాతరకు 25 రోజులు మాత్రమే మిగిలి ఉంది. సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ బాధ్యతను సీతక్క మూడురోజులుగా అక్కడే మకాం వేసి పరిశీలిస్తున్న విషయం తెలసిందే. అయితే.. జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జాతర ఏర్పాట్లలో వేగం పెంచింది. ఈ నెల 31లోగా అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు డెడ్ లైన్ ఇచ్చారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం మహాజాతర జరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు.
మహాజాతరలో అమర్చిన సీసీ ఫోటేజ్ ను సీతక్క పరిశీలించి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈసారి జాతరకు ఆరు రాష్ట్రాల నుంచి 50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. కొత్తూరు సమీపంలోని వీఐపీ పార్కింగ్, ఆర్టీసీ బస్టాండ్, హరిత హోటల్, జంపన్న వాగు స్నాన ఘాట్లు, స్థూపం రోడ్డు, మరుగుదొడ్లను పరిశీలించారు. కన్నెపల్లి గ్రామంలోని సారలమ్మ ఆలయ పరిసరాలను పరిశీలించారు. మరుగుదొడ్లు, తాగునీరు, లైటింగ్ ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, వసతులు కల్పించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోను జాతరలో ఆటంకాలు తలెత్తకుండా చూడాలని కోరారు.
Pending Challans: మూడురోజులే గడువు.. పెండింగ్ చలాన్లు కట్టని వారు కట్టేయండి బాబు..
తాజావార్తలు
-
Dragon : అర్ధరాత్రి RFCలో ఎన్టీఆర్, రుక్మిణి.. ‘డ్రాగన్’ సెట్స్ నుండి క్రేజీ లీక్!
-
E20 Petrol: E20 పెట్రోల్పై కేంద్రానికి షాక్.. 53% NDA ఓటర్లు వ్యతిరేకం..
-
Free Afghan Women: ఒక బుర్ఖా.. 1000 ప్రశ్నలు.. ప్రపంచాన్ని కదిలిస్తున్న ట్రెండ్ వెనుక అసలు కథ ఇదే!
-
Modi-Ketan Agarwal: ప్రధాని, రాష్ట్రపతికి కేతన్ అగర్వాల్ కుటుంబం లేఖ.. ఏముందంటే..!
-
Bhojshala Case: భోజ్శాలలో నమాజ్కు అనుమతి లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!