Thota Chandrasekhar: విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్ లో అందుకే పాల్గొంటున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana: వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ సర్కారుకు సీపీఐ మద్దతువిశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించొద్దంటూ కార్మికులు ఓ వైపు ఉద్యమాలు చేస్తుండగానే కేంద్రం మాత్రం దానిని విక్రయించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను తొలి నుంచీ వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు బిడ్డింగులో పాల్గొనాలని సంచలన నిర్ణయం తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తెలంగాణ సర్కారు మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉంది. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్లో తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొననుంది. ఈ మేరకు కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫ్యాక్టరీ నిర్వహణ కోసం మూలధనం/ ముడిసరుకుల కోసం నిధులు ఇచ్చి ఉక్కు ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు యాజమాన్యం నిర్వహిస్తున్న ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ ప్రతిపాదనల బిడ్డింగులో సింగరేణి లేదంటే రాష్ట ఖనిజాభివృద్ది సంస్థ లేదంటే నీటిపారుదల శాఖ పాల్గొనే అవకాశం ఉంది.
Read Also: CPI Narayana: వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ సర్కారుకు సీపీఐ మద్దతు
Also Read
- Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
- OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
- Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
- Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి రమ్మని KCR పంపించారన్నారు బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. కార్మికుల పోరాటానికి వెన్నుదన్నుగా నిలుస్తాం….బీజేపీని ఢీ కొట్టే నాయకుడు కేసీఆర్…అందుకే బిడ్ లో పాల్గోవాలని నిర్ణయించారు….AP కి విభజన హామీలు అమలు చేయకుండా BJP అన్యాయం చేసింది….విభజన హామీల సాధనకు BRS కట్టుబడి ఉంది.ప్రయివేటీకారణ వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది.
బీఆర్ఎస్ పోరాటం రాజకీయాలకు అతీతం….వేలాది మంది కార్మికుల ప్రయోజనాలు, పరిశ్రమ ఆస్తుల పరిరక్షణ BRS లక్ష్యం అన్నారు చంద్రశేఖర్. స్ట్రాటజిక్ సేల్ ను కేంద్రం సంహరించుకునే వరకు పోరాడతాం.ఆదానీ బొగ్గు నిల్వ చేసుకోవడానికి అవసరమైన భూములు కాజేసేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే ప్రయివేటీకరణ…ఐదు వేల కోట్లు ఋణంగానో…..సహాయంగానో ఇవ్వకుండా నష్టాలను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ల్యాండ్ బ్యాంక్ ను రిలీజ్ చెయ్యాలి.. ఏపీ ప్రభుత్వం రుణ సహాయం చేసేందుకు ముందుకు రావాలన్నారు తోట చంద్రశేఖర్.
Read Also: HIV: జైల్లో 44 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్
తాజావార్తలు
-
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
-
Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్డేట్!
-
Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
ట్రెండింగ్
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!