Assam: వర్షం కారణంగా రాకపోకలు బంద్..చెల్లి మృతదేహాన్ని 5కి.మీ మోసుకెళ్లిన సోదరులు
- అస్సాం రాష్ట్రం లఖింపూర్ జిల్లాలో భారీగా వరదలు
- వాహనాలు..రైళ్ల రాకపోకలకు అంతరాయం
- టైఫాయిడ్తో ఆస్పత్రిలో మరణించిన బాలిక
- మృదేహాన్ని తరలించేందుకు మార్గం లేకపోవడంతో వర్షంలో మోసుకెళ్లిన సోదరులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాం రాష్ట్రం లఖింపూర్ జిల్లాలో వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రజలు తమ నివాసాలుగా పైకప్పులపై నివసించవలసి వస్తోంది. ఇక్కడ ఓ హృదయ విదారకమైన సంఘటన చోటుచేసుకుంది. వరదల కారణంగా రోడ్లు మూసుకుపోవడంతో ఓ టీనేజ్ బాలిక చికిత్స పొందలేక మృతి చెందింది. బాలిక మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు వాహనం వెళ్లే మార్గం లేదు. అలాంటి పరిస్థితిలో ఇద్దరు అన్నదమ్ములు తమ సోదరి మృతదేహాన్ని భుజాలపై ఎత్తుకుని గ్రామానికి చేరుకున్నారు.
READ MORE: Ford Capri EV: సరికొత్త లుక్ లో ఫోర్డ్ కాప్రీ ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 627 కి.మీ
Also Read
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
- Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
- AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
మైలానీ పోలీస్ స్టేషన్లోని ఎలంగాంజ్ మహారాజ్ నగర్లో నివసిస్తున్న శివాని (15) టైఫాయిడ్తో మరణించింది. శివాని 12వ తరగతి విద్యార్థిని. 2 రోజుల క్రితం పాలియాలో శివాని ఆరోగ్యం క్షీణించింది. డాక్టర్ దగ్గరకు వెళ్లగా టైఫాయిడ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో డాక్టర్ శివానికి మందు ఇచ్చి ఆస్పత్రిలో చేర్చారు. ఆ తర్వాత బాలిక పరిస్థితి విషమంగా మారింది. వర్షం కారణంగా, పాలియా నగరం జలమయమైంది. నీటిమట్టం పెరగడంతో చుట్టుపక్కల రోడ్లన్నీ మూసుకుపోయాయి. రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. వాహనాలు, రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో తన సోదరికి మెరుగైన వైద్యం అందలేదని.. దీంతో ఆమె మరణించిందని శివాని సోదరుడు మనోజ్ చెప్పాడు. వాహనం వచ్చేందుకు మార్గం లేకపోవడంతో పడవ సాయంతో నది దాటారు. అక్కడి నుంచి గ్రామం అయిదు కిలోమీటర్లు ఉంది.
READ MORE:Mungeli Agniveer missing: అగ్నివీర్ మిస్సింగ్..గోడ దూకి తప్పించుకున్నట్లు అధికారుల వివరణ
అన్నదమ్ములిద్దరూ వంతులవారీగా తమ సోదరి మృతదేహాన్ని భుజాలపై వేసుకుని రైలు మార్గం వెంబడి స్వగ్రామానికి వెళ్లడం కనిపించింది. ఈ ఘటనపై అటు ప్రభుత్వం, ఇటు అధికారులు ఎవరూ స్పందించలేదు. తన సోదరి పల్లకీని భుజాన వేసుకోవాల్సిన అన్నదమ్ములు.. నేడు తమ సోదరి మృతదేహాన్ని భుజాలపై వేసుకుని 5 కిలోమీటర్లు కాలినడకన తమ గ్రామానికి వచ్చారని శివాని తండ్రి దేవేంద్ర కన్నీరుమున్నీరుగా విలపించారు.
తాజావార్తలు
-
Diabetes: షుగర్ కంట్రోల్కు ఈ 3 కూరగాయలు బెస్ట్.. నిపుణుల సూచనలు ఇవే
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
-
Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!