KPHB Police : చెల్లిని సరిగ్గా చూసుకోవటం లేదని బావను చంపిన వైనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెల్లిని సరిగ్గా చూసుకోవటం లేదని, స్నేహితుడి వద్ద తీసుకున్న అప్పు చెల్లించటం లేదని బావా పై పగ పెంచుకున్న ఓ బావమరిది హత్యకు పాల్పడిన సంఘటన కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం నాడు చోటు చేసుకోగా నేడు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ సందర్భంగా కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూకట్పల్లి ఏసిపి చంద్రశేఖర్ వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కొహిర్ కు చెందిన అబ్దుల్ అన్వర్(27) 2019లో మియాపూర్ హఫీజ్ పేటకు చెందిన షరీన్ ను వివాహం చేసుకున్నాడు. షరీన్ సోదరుడు సయ్యద్ అహ్మద్, స్నేహితుడు మొహమ్మద్ అకీల్ వద్ద ఆటోను అద్దెకు తీసుకొని నడుపుతూ జీవిస్తూ ఉండేవాడు. అన్వర్ రోజు మద్యం సేవించి షరీన్ ను వేధించేవాడు. దానికి తోడు అకీల్ వద్ద అప్పుగా తీసుకున్న డబ్బులు, ఆటో అద్దె డబ్బులు చెల్లించకుండా, పూచీకత్తు పెట్టిన షరీన్ తల్లి పరువు పోగొట్టాడు అని అహ్మద్, తన బావా పై పగ కక్ష్య పెంచుకున్నాడు.
Also Read : Gandhari Jatara : అట్టహాసంగా ప్రారంభమైన గాంధారి జాతర
Also Read
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
- Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
- Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
గత నెల 31వ తేదీన అహ్మద్ తన స్నేహితులు అకీల్, ఇమ్రాన్ లతో కలిసి అన్వర్ ను మద్యం సేవిద్దామని, ఆటోలో హఫీజ్ పేట్ రైల్వే ట్రాక్ వద్దకు తీసుకుని వెళ్లారు. అక్కడి నుండి బొరబండ మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్దకు వెళ్ళి మద్యం సేవిద్దామని ఫోన్ చేసిన ఇమ్రాన్ స్నేహితుడు అమీర్ తో కలిసి మద్యం సేవిస్తూ హఫీజ్ పేట్ బయలుదేరారు.అప్పటికే ఆటోలో గొడవపడుతున్న వారు, కె.పి.హెచ్.బి కాలనీ ముళ్ళకత్వ చెరువు వద్దకు రాగానే, నిర్మానుష్య ప్రదేశాన్ని గుర్తించి ఆటోను నిలిపివేశారు. అన్వర్ కిందకు దిగగానే అహ్మద్ బీర్ బాటిల్ తో దాడి చేశాడు. అక్కడి నుండి పారిపోయేందుకు అన్వర్ ప్రయత్నించగా అతడిని ఇమ్రాన్ కొట్టాడు కింద పడిన అన్వర్ చేతులను అహ్మద్ పట్టుకోగా, అకీల్ కాళ్ళను ఒడిసి పట్టుకున్నాడు. అక్కడే చెత్తలో దొరికి టైల్స్ ముక్కతో ఇమ్రాన్, అన్వర్ తల పై గొంతు పై దాడి చేసి హత్య చేశారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సయ్యద్ అమీర్ ను చంపుతానని బెదిరించారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఈ రోజు నిందితులను అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకొని, నిందితులు ముగ్గురిని రిమాండుకు తరలిస్తున్నామని ఏసిపి తెలిపారు.
Also Read : Jammu Kashmir: జైషే మహ్మద్ ఉగ్రవాదుల అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..