Breaking News A Road Accident In Hyderabad: హైదరాబాద్ నగరంలో నేడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో యువతి మరణించగా., మరొకరికి తీవ్ర గాయాల కారణంగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. నగరంలోని బేగంపేటలో ఉన్న లైఫ్ స్టైల్ బిల్డింగ్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎస్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ శంకర్ రావుకు తీవ్ర గాయాలు కాగా.. అతని కుమార్తె ప్రసన్న స్పాట్ లోనే మరణించింది.
Paravada: పరవాడ సినర్జిన్ ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. ఇప్పటికే ముగ్గురు మృతి..!
ఓ టెంపో వాహనం బైకును వెనుకనుంచి గుద్దడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. సంఘటన సమయంలో ప్రసన్నకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఇక తండ్రి సబ్ ఇన్స్పెక్టర్ శంకర్ రావుకు తీవ్ర గాయాలు కావడంతో అతని దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడికక్కడే చనిపోయిన ప్రసన్న మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
