RJD Leader: బ్రాహ్మణులు ఇండియన్స్ కాదు.. ఆర్జేడీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RJD Leader Yaduvansh Kumar Yadav: రాష్ట్రీయ జనతాదళ్ (RJD) జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే యదువంశ్ కుమార్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణులు భారతదేశానికి చెందినవారు కాదని, వాస్తవానికి రష్యా, ఇతర యూరోపియన్ దేశాలకు చెందినవారని ఆయన ఆరోపించారు.బీహార్లోని సుపాల్లో శనివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో యదువంశ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. “యాదవ సమాజం ఈ దేశానికి చెందినది, బ్రాహ్మణుల డీఎన్ఏ పరీక్షలో ఈ దేశానికి చెందినవారు కాదని, రష్యా, ఇతర యూరోపియన్ దేశాలకు చెందిన వారని తేలింది. ఇప్పుడు ఇక్కడ స్థిరపడ్డారు. బ్రాహ్మణులు మనల్ని విభజించి పాలించడానికి ప్రయత్నిస్తున్నారు. వారిని ఇక్కడి నుంచి తరిమికొట్టడం ముఖ్యం.” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
యదువంశ్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఆర్జేడీ మిత్రపక్షమైన జనతాదళ్ (యునైటెడ్)కి మింగుడుపడలేదు. పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ కుమార్ ఝా ఆర్జేడీ నేత చేసిన వ్యాఖ్యలు దారుణం.. పరశురాముడు రష్యా నుంచి వచ్చాడా లేక మరేదైనా దేశం నుంచి వచ్చాడా.. మీడియాలో ఉండేందుకు ఆర్జేడీ నేతలు ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి నేతలపై ఆర్జేడీ చర్యలు తీసుకోవాలని, ఆర్జేడీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మహాఘటబంధన్ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తున్నారని అభిషేక్ కుమార్ ఝా అన్నారు.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
Read Also: Explosion: కెమికల్ ప్లాంట్లో భారీ పేలుడు.. ఐదుగురు దుర్మరణం
వివాదాస్పద ప్రకటనలు చేయడానికి కూటమి భాగస్వాముల మధ్య పోటీ ఉందని, బీహార్లో అధికారంలో ఉన్న మహాఘటబంధన్పై బీజేపీ అవహేళన చేసింది.”ఆర్జేడీ నాయకుడి మానసిక స్థితి నిలకడగా లేదని నేను భావిస్తున్నాను. ఈ ప్రాంతానికి చెందిన ఆర్జేడీ నాయకుడు మనోజ్ కుమార్ ఝా, జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు సంజయ్ ఝా బ్రాహ్మణులు అసలు దేశంలో ఉన్నారా లేదా వేరే వారి నుండి వచ్చారా అని వివరించాలి. ” అని బీజేపీ శాసనసభ్యుడు నీరజ్ కుమార్ బబ్లూ అన్నారు.ఈ ఏడాది జనవరిలో బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ రామాయణం ఆధారంగా రూపొందించిన రామచరిత్ మానస్ అనే హిందూ మత గ్రంథం ‘సమాజంలో ద్వేషాన్ని వ్యాపింపజేస్తుంది’ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీలతో పాటు బీహార్లోని ఆర్జేడీ మిత్రపక్షమైన జేడీ(యూ) కూడా విమర్శించాయి.
తాజావార్తలు
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!