Kerala: ఎన్సీఆర్బీ పేరుతో యువకుడికి ఫేక్ మెసేజ్.. భయంతో విద్యార్థి ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: కేరళలోని కోజికోడ్లో జరిగిన ఓ విషాద ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎన్సీఆర్బీ పేరుతో ఫేక్ మెసేజ్ రావడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న యువకుడి వయసు 16 ఏళ్లు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) పేరుతో ఫేక్ మెసేజ్ రావడంతో ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనధికార మూవీ వెబ్సైట్ను యాక్సెస్ చేసేందుకు ఆ యువకుడు ప్రయత్నించినట్లు, ఆ సైట్ పేమెంట్ చేయాలని కోరినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Afghanistan: ఇండియాలో ఆఫ్ఘాన్ ఎంబసీ మూసివేత.. యూకే, యూఎస్ఏలకు దౌత్యవేత్తలు..
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
అసలేం జరిగిందంటే.. కోజికోడ్లోని ఓ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న ఆదినాథ్ బుధవారం సాయంత్రం చెవాయూర్లోని తన అపార్ట్మెంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి ఆదినాథ్ గదిలో లభించిన సూసైడ్ నోట్లో ఆన్లైన్లో మోసపోయినట్లు అందులో ఉందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. దీంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన తల్లిని ఉద్దేశించి రాసిన సూసైడ్ నోట్లో, తాను ఏ అనధికార వెబ్సైట్కి లాగిన్ చేయలేదని, అయితే తన ల్యాప్టాప్లో చట్టబద్ధమైన వెబ్సైట్లో సినిమా చూశానని ఆదినాథ్ పేర్కొన్నారని పోలీసు అధికారి తెలిపారు.
Also Read: Uniform Civil Code: స్వలింగ వివాహం యూసీసీ పరిధిలోకి రాదు..!
ల్యాప్టాప్లో అనధికార వెబ్సైట్ను యాక్సెస్ చేయడం వల్ల అతనికి రూ.30 వేలు కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని ఎన్సీఆర్బీ పేరుతో నకిలీ సందేశం వచ్చింది. అలా చేయని పక్షంలో భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తారని ఆ మెసేజ్లో ఉంది. దీంతో విద్యార్థి ఆదినాథ్కు భయం వేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ల్యాప్టాప్ బ్రౌజర్ హిస్టరీని పరిశీలించగా, చనిపోయిన విద్యార్థి ఏ అక్రమ వెబ్సైట్ను తెరిచినట్లు కనిపించలేదని ఓ పోలీసు అధికారి అన్నారు. “బ్రౌజర్ చరిత్ర తొలగించబడిందో లేదో మాకు తెలియదు, కానీ నిజం బయటకు తీసుకురావడానికి దర్యాప్తు అవసరం.’ అని ఆయన చెప్పారు. ఇప్పటికే విచారణ ప్రారంభించామని, త్వరలో విద్యార్థి తల్లిదండ్రుల నుంచి సమాచారం సేకరిస్తామని పోలీసులు తెలిపారు. విద్యార్థి మృతి చెందడంతో తల్లిదండ్రులు వేరే ఇంటికి మారారని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!