Botsa Satyanarayana Emotional: ఆ మహానేతను తలుచుకొని కంటతడి పెట్టిన బొత్స..!
- వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహణ
- మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జ్ఞాపకాలతో భావోద్వేగానికి గురైన బొత్స
- వైఎస్సార్పై దిగజారుడు వ్యాఖ్యలు బాధ కలిగించాయని ఆవేదన
- జగన్ ‘మావిగన్’ వ్యాఖ్యలపై కూటమి నేతల స్పందనపై విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana Emotional: వైస్సార్సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ నేడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ ఈవెంట్ లో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా మాజీ సీఎం, దివంగత నేత రాజశేఖర రెడ్డి మరణాన్ని ప్రస్తావిస్తూ కంటతడి పెట్టారు. మహానేత గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజా రాజకీయ పరిణామాలపై స్పందించిన బొత్స తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ‘మావిగన్’ గురించి మాట్లాడినప్పటి నుంచి కూటమి నేతలు, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని ఎక్కువగా పట్టించుకుంటున్నారని విమర్శించారు. అలాగే “మా నాయకుడి ఆలోచనలు మీకు ఎందుకు భయం కలిగిస్తున్నాయి?” అంటూ ప్రశ్నించారు.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
రాష్ట్ర మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, రాజకీయ విలువలు తగ్గిపోయాయని బొత్స అన్నారు. ముఖ్యంగా అచ్చెన్నాయుడు సహనం కోల్పోయి అహంభావంతో వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో చేసిన వ్యాఖ్యలు, చర్యలు మర్చిపోయి ఇప్పుడు ఇతరులను విమర్శించడం సరైంది కాదన్నారు. వైఎస్సార్ వంటి నాయకులు అరుదుగా వస్తారని, ఆయన వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడిందని బొత్స గుర్తు చేశారు. ఆయన మరణంపై అసత్య ప్రచారాలు చేయడం తగదని హెచ్చరించారు. “రాజశేఖర్ రెడ్డి మరణం గురించి నేను చెప్పానని ప్రచారం చేయడం బాధాకరం” అని అన్నారు.
Russia New Plan: అమెరికాకు షాక్.. మాస్టర్ ప్లాన్ వేసిన రష్యా..
వైఎస్సార్ మృతదేహాన్ని గుర్తించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ బొత్స భావోద్వేగానికి గురయ్యారు. తెల్లవారుజామున పావురాల గుట్ట వద్ద మృతదేహాన్ని గుర్తించి ఉదయం 5 గంటలకు కర్నూలుకు తరలించిన విషయాన్ని వివరించారు. రాజకీయాల కోసం దిగజారుడు స్థాయికి వెళ్లకూడదని బొత్స సూచించారు. “దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోండి, కానీ మరణించిన మహానాయకులపై విమర్శలు చేయకండి” అని అన్నారు. పరస్పర గౌరవం ఉండాలని, నీతిగా రాజకీయాలు చేయాలని సూచించారు. తమ పార్టీ, నేతల చరిత్రపై తమకు పూర్తి అవగాహన ఉందని, తప్పుడు ప్రచారాలను మానుకోవాలని హెచ్చరించారు. “ఇదేనా మీ సంస్కృతి?” అంటూ ప్రత్యర్థులను ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!