Botsa Satyanarayana: డయేరియా మరణాలకు కూటమి సర్కారే కారణం.. బొత్స కీలక వ్యాఖ్యలు
- గుర్లలో డయేరియా మరణాలకు కూటమి ప్రభుత్వమే కారణం
- ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: విజయవాడలోని గుర్లలో డయేరియా మరణాలకు కూటమి ప్రభుత్వమే కారణమని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. డయేరియా బాధితులు ఇంకా మరొకొన్ని గ్రామాలలో ఉన్నారని ఆయన తెలిపారు. 16 మంది డయేరియా బారిన పడి మృతి చెందారన్నారు. అధికారులు ఒకటి రెండు అని చెప్పారని.. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 10 అని చెప్పారని ఆయన వెల్లడించారు. చనిపోవడానికి బహిరంగ మలవిసర్జన కారణమని ఇప్పుడు చెబుతున్నారంటూ మండిపడ్డారు.
గత వారసత్వ ద్వారా వస్తున్న లోపాలే ఇప్పుడు సరిచేసుకోవాల్సి వస్తోందని పవన్ అన్నారన్న ఆయన.. గతంలో ఎన్నడూ పదహారు మంది చనిపోయిన దాఖలాలు జిల్లాలో గానీ, చీపురుపల్లిలో గానీ లేవని బొత్స పేర్కొన్నారు. చంపావతి నుంచి సంకిలి వరకు పైప్ లైన్స్ వేసి నీరిచ్చామన్నారు. ఈ రోజుకి పది రోజులైనా నాగలవలసలో మరో రెండు కేసులు నమోదయ్యాయన్నారు. పది రోజులలో నియంత్రణ చెయ్యకపోతే ఎందుకు ఈ ప్రభుత్వమంటూ ప్రశ్నించారు. వీరంతా సాయం అందకపోవడం వల్లే చనిపోయారని ఆరోపించారు. వరదలలో ముప్పై రెండు మంది కొట్టుకు పోయారన్నారు. రుషికొండ ఏమైనా ప్రయివేటు ప్రాపర్టీనా… ప్రభుత్వానిదే కదా.. కొండపై భవనాలు కట్టాం.. అందులో లోపాలంటే ఎంక్వైరీ చేయించాలన్నారు.
Also Read
Read Also: Simhachalam: సింహాచలం అప్పన్న సన్నిధిలో అపచారం.. మద్యం తాగి చిందులు
గుర్లలో ఓ ఉపాధ్యాయుడు ఇప్పుడే చనిపోయారని.. డిప్యూటీ సీఎం వచ్చి వెళ్లాక చనిపోయారని ఆయన తెలిపారు. ఎక్కడ లోపం జరిగింది అన్నదానిపైన ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎవరిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఇంకా ఎంక్వైరీలకు ఎవ్వరో వస్తారట.. అప్పుడు చర్యలు తీసుకుంటారట అంటూ ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వానికి అధికార యంత్రాంగంపై పట్టులేదని ఆరోపించారు. డయేరియా ప్రబలిన ఏడు గ్రామాలలో సర్వే చెయ్యండని చెబుతున్నామన్నారు. పైప్ లైన్ నిర్వహణ లోపం లేక ఇది జరిగింది.. ప్రతీ వారం దీనిని పరిశీలించాలి… గత నాలుగు నెలల్లో ఎక్కడ శుద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సంక్రాంతి వరకు ఆగాలనుకున్నాం.. ఇలా ప్రాణాలు కోల్పోతుంటే ఇంకెన్నాళ్లు ఆగాలంటూ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!