BSF Inspector: మహిళా కానిస్టేబుల్పై బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ అత్యాచారం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSF Inspector: పశ్చిమ బెంగాల్లోని కిషన్గంజ్ ప్రాంతంలోని సరిహద్దు ఔట్పోస్టు వద్ద మహిళా కానిస్టేబుల్పై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఒక బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయబడ్డారు. అతనిపై శాఖాపరమైన విచారణ ప్రారంభించినట్లు బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి మంగళవారం తెలిపారు. నదియా జిల్లా ఔట్పోస్ట్లోని తుంగి సరిహద్దు వద్ద నియమించబడిన ఇన్స్పెక్టర్ ఫిబ్రవరి 19న ప్రాంగణంలో మహిళా బీఎస్ఎఫ్ కానిస్టేబుల్పై అత్యాచారానికి పాల్పడ్డారని ఆయన తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ దీనిపై స్పందించాలని బీజేపీ బెంగాల్ యూనిట్ను కోరిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయబడ్డాడని, అతనిపై శాఖాపరమైన విచారణ జరుగుతోందని బీఎస్ఎఫ్ అధికారి వెల్లడించారు. మహిళా కానిస్టేబుల్ను ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. ఆమె ఫిర్యాదు ప్రకారం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. డిపార్ట్మెంటల్ విచారణ ముగిసే వరకు బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ గురించి మరిన్ని వివరాలను వెల్లడించడానికి బీఎస్ఎఫ్ అధికారి నిరాకరించారు. ఈ ఆరోపణలు నిజమైతే అతనిని చట్టం ప్రకారం శిక్షిస్తామని పేర్కొన్నారు.
Also Read
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
Read Also: Missing girls: మిస్టరీగానే బాలికల మిస్సింగ్ కేసు.. ఇంకా దొరకని ముగ్గురి ఆచూకీ
కునాల్ ఘోష్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. కృష్ణాగంజ్, నదియా క్యాంప్లో బీఎస్ఎఫ్ కమాండర్ ఒక లేడీ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్పై అత్యాచారం చేశారని ఆరోపించారు. ఇప్పుడు బీజేపీ ఏం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2021లో బీఎస్ఎఫ్ చట్టాన్ని సవరించి, పంజాబ్, పశ్చిమ బెంగాల్, అస్సాంలోని అంతర్జాతీయ సరిహద్దు నుంచి 15 కి.మీల దూరంలో కాకుండా, 50 కి.మీ.ల పరిధిలో శోధన, స్వాధీనం, అరెస్టులను చేపట్టడానికి అధికారాన్ని బీఎస్ఎఫ్కు ఇచ్చింది. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అధికార టీఎంసీ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడంతో బెంగాల్లో ఇది ప్రధాన రాజకీయ సమస్యగా మారింది.
తాజావార్తలు
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..