Bomb Threat : జైపూర్లో హైఅలర్ట్.. సవాయ్ మాన్సింగ్ స్టేడియంకు బాంబు బెదిరింపు
- సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో బాంబు పెట్టినట్టు బెదిరింపులు
- జైపూర్ స్టేడియం చుట్టుపక్కల భారీ మోహరించిన పోలీసులు
- స్టేడియం లోపల నుంచి అందర్నీ బయటకు పంపించివేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Threat : ఆపరేషన్ సింధూర్’ విజయంతో దేశమంతా ఉత్సాహంగా ఉన్న వేళ, రాజస్థాన్లోని జైపూర్లో మాత్రం భయానక వాతావరణం నెలకొంది. సవాయ్ మాన్సింగ్ (SMS) స్టేడియంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు మెయిల్ రావడంతో నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. రాజస్థాన్ రాష్ట్ర క్రీడా మండలికి ఈ బెదిరింపు సందేశం మెయిల్ ద్వారా ఉదయం 9:13 గంటల ప్రాంతంలో అందింది. “ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా మీ స్టేడియంలో బాంబు పేలుస్తాం” అంటూ ఆ మెయిల్లో హెచ్చరించడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ ఘటన, భారత సాయుధ దళాలు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాదాపు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఒక రోజు తర్వాత చోటుచేసుకుంది.
Rishabh Pant : భాయ్.. డ్రెస్సింగ్ రూమ్ నిన్ను మిస్ అవుతుంది..!
Also Read
- Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
- Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
కేవలం 25 నిమిషాల వ్యవధిలో, భారత్ బాలాకోట్ తర్వాత అతిపెద్ద సరిహద్దు దాటి దాడులను నిర్వహించింది. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో జరిగిన ఈ మెరుపు దాడుల్లో వైమానిక, నావికా , భూతల దళాలు పాల్గొన్నాయి. ఏప్రిల్ 22న పహల్గామ్లో 26 మంది పౌరులను బలిగొన్న ఉగ్రదాడికి ప్రతీకారంగా చీకటిలో ఈ ఆపరేషన్ జరిగింది. అగ్రశ్రేణి వర్గాల సమాచారం ప్రకారం, నిషేధిత జైషే మహ్మద్ (JeM), లష్కరే తోయిబా (LeT) , హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన దాదాపు 100 మంది ఉగ్రవాదులు ఈ ఖచ్చితమైన దాడుల్లో హతమయ్యారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగానే ఈ లక్ష్యాలను ఎంపిక చేశామని ప్రభుత్వం ఒక విలేకరుల సమావేశంలో తెలిపింది.
బెదిరింపు మెయిల్ రాగానే జైపూర్ పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. సవాయ్ మాన్సింగ్ స్టేడియం చుట్టుపక్కల భారీగా పోలీసు బలగాలను మోహరించారు. స్టేడియం లోపల ఉన్న వారందరినీ తక్షణమే బయటకు పంపించివేశారు. అంతేకాకుండా, స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్లు స్టేడియం లోపల , వెలుపల క్షుణ్ణంగా గాలిస్తున్నారు. నగరంలో భయాందోళనలు నెలకొన్నప్పటికీ, పోలీసులు ప్రజలకు ధైర్యం చెబుతూ భద్రతా చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఈ బెదిరింపు వెనుక ఎవరున్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ‘ఆపరేషన్ సింధూర్’ విజయం తర్వాత దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఘటన మరింత ఆందోళన కలిగిస్తోంది.
Missile Attack : అమృతసర్ లక్ష్యంగా పాక్ మిస్సెల్ అటాక్.. తిప్పికొట్టిన భారత్..!
తాజావార్తలు
-
Public Charging: రైల్వే స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
-
Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
-
Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
-
Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!