Air India-Bomb: టిష్యూ పేపర్పై నోట్.. ఎయిరిండియా విమానంలో బాంబ్ కలకలం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Flight Bomb: ఎయిర్ ఇండియా విమానంలో టిష్యూ పేపర్పై రాసున్న నోట్ కలకలం రేపింది. టిష్యూ పేపర్పై బాంబ్ అని రాసుండడంతో విమాన సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అందరూ వెంటనే విమానం నుంచి కిందకు దిగారు. అయితే అనుమానాస్పద వస్తువులు ఏమీ విమానంలో లభ్యం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ఎయిర్ ఇండియా విమానం ఏడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. వివరాల్లోకి వెళితే…
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వడోదరకు వెళ్లేందుకు ఎయిరిండియా విమానం (AI-819) బుధవారం రాత్రి 7 గంటలకు సిద్ధమైంది. అంతలోనే విమానం వాష్రూంలో బాంబ్ అని రాసి ఉన్న ఓ టిష్యూ పేపర్ సిబ్బంది (ఎయిర్లైన్ సెక్యూరిటీ మేనేజర్) కంట పడింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. వెంటనే ప్రయాణికులు అందరినీ కిందకు దించేశారు. సీఐఎస్ఎఫ్తో పాటు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. భద్రతా సిబ్బంది విమానంలో తనిఖీలు చేపట్టారు. అయితే అనుమానాస్పద వస్తువులు లభ్యం కాకపోవడంతో.. అధికారులు, విమాన సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read
- 10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
- 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
Also Read: Krishnamma OTT: ఎలాంటి ప్రకటన లేకుండా.. వారానికే ఓటీటీలోకి వచ్చేసిన ‘కృష్ణమ్మ’!
‘ప్రయాణికులు అందరినీ సురక్షితంగా కిందకు దించేశాం. భద్రతా సంస్థలు తనిఖీలు చేపట్టాయి. అనుమానాస్పద వస్తువులు ఏమీ లేవు. ఊహించని ఈ అంతరాయం కారణంగా ప్రయాణికులకు అసౌకర్యం కలిగింది. ప్రయాణికులకు వసతి సౌకర్యం కల్పించాం. ప్రత్యేక విమానంలో ప్రయాణికులు వడోదరకు వెళ్లారు. ప్రయాణికులతో పాటు సిబ్బంది భద్రతకు మేం కట్టుబడి ఉన్నాం’ అని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది.
తాజావార్తలు
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
-
Sandeep Reddy Vanga: ప్రభాస్ ‘స్పిరిట్’ vs మహేశ్ ‘వారణాసి’.. క్లాష్పై వంగా కామెంట్ వైరల్!
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?