Air India-Bomb: టిష్యూ పేపర్పై నోట్.. ఎయిరిండియా విమానంలో బాంబ్ కలకలం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Flight Bomb: ఎయిర్ ఇండియా విమానంలో టిష్యూ పేపర్పై రాసున్న నోట్ కలకలం రేపింది. టిష్యూ పేపర్పై బాంబ్ అని రాసుండడంతో విమాన సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అందరూ వెంటనే విమానం నుంచి కిందకు దిగారు. అయితే అనుమానాస్పద వస్తువులు ఏమీ విమానంలో లభ్యం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ఎయిర్ ఇండియా విమానం ఏడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. వివరాల్లోకి వెళితే…
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వడోదరకు వెళ్లేందుకు ఎయిరిండియా విమానం (AI-819) బుధవారం రాత్రి 7 గంటలకు సిద్ధమైంది. అంతలోనే విమానం వాష్రూంలో బాంబ్ అని రాసి ఉన్న ఓ టిష్యూ పేపర్ సిబ్బంది (ఎయిర్లైన్ సెక్యూరిటీ మేనేజర్) కంట పడింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. వెంటనే ప్రయాణికులు అందరినీ కిందకు దించేశారు. సీఐఎస్ఎఫ్తో పాటు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. భద్రతా సిబ్బంది విమానంలో తనిఖీలు చేపట్టారు. అయితే అనుమానాస్పద వస్తువులు లభ్యం కాకపోవడంతో.. అధికారులు, విమాన సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read
Also Read: Krishnamma OTT: ఎలాంటి ప్రకటన లేకుండా.. వారానికే ఓటీటీలోకి వచ్చేసిన ‘కృష్ణమ్మ’!
‘ప్రయాణికులు అందరినీ సురక్షితంగా కిందకు దించేశాం. భద్రతా సంస్థలు తనిఖీలు చేపట్టాయి. అనుమానాస్పద వస్తువులు ఏమీ లేవు. ఊహించని ఈ అంతరాయం కారణంగా ప్రయాణికులకు అసౌకర్యం కలిగింది. ప్రయాణికులకు వసతి సౌకర్యం కల్పించాం. ప్రత్యేక విమానంలో ప్రయాణికులు వడోదరకు వెళ్లారు. ప్రయాణికులతో పాటు సిబ్బంది భద్రతకు మేం కట్టుబడి ఉన్నాం’ అని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!