Bollineni Ramarao: ఆఖరి ప్రయత్నంగా చంద్రబాబుని కలుస్తా.. ఆవేదనను బాబు ముందు ఉంచుతా: బొల్లినేని రామారావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘చంద్రబాబు అన్నా.. తెలుగుదేశం పార్టీ అన్నా నాకు ప్రాణం. ఇతర పార్టీల నేతలు కూడా నాతో మాట్లాడారు కానీ స్పందించలేదు. 14 నాలుగు సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నా. పక్కన నియోజక వర్గ నేతలకు ఇచ్చిన గౌరవం కూడా నాకు ఇవ్వలేదు. నేను ఆవేదనతో మాట్లాడుతున్నా. దళారీలను పక్కనపెట్టి చంద్రబాబు నేరుగా నివేదిక తీసుకోవాలి. అప్పుడే వాస్తవాలు తెలుస్తాయి. చంద్రబాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించాను కానీ వీలు కాలేదు. వచ్చే నెల 2న నెల్లూరుకు వస్తున్న చంద్రబాబుతో కలుస్తాను. ఆయన ఏమి చెబుతారో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటా. ఆయన చెప్పిన విషయాన్ని మీ ముందు ఉంచుతాను. మీరు ఏమి చెబితే అది చేస్తా. మనకు అంతా మంచి జరగాలనే ఆశిస్తా. ఎవరు బాధపడాల్సిన పని లేదు’ అని టీడీపీ సీనియర్ నేత బొల్లినేని రామారావు అన్నారు.
‘నా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదు. టికెట్ ఇవ్వలేమని నాకు ముందే చెప్పి ఉంటే నేను తూచా తప్పకుండా పాటించేవాడిని. కానీ గౌరవించకపోవడం పట్ల బాధ కలుగుతోంది. స్థానిక నేతలు ఎవరికీ తెలియకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నా. 2012 ఉప ఎన్నికల్లోఎవరూ ముందుకు రాకపోతే.. చంద్రబాబు నన్ను పోటీ చేయమన్నారు. అప్పుడు పోటీ చేసి ఓడిపోయా. అప్పటినుంచి సొసైటీ, స్థానిక సంస్థల ఎన్నికలు కోసం ఆర్థికంగా సాయం చేశా. 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి.. ఉదయగిరిలో ఎన్నో మంచి పనులు చేశాను. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, వెంకయ్యనాయుడు సహకారంతో అభివృద్ధి చేశా. నేను ఎక్కడా తప్పు చేయలేదు. రాజకీయాల్లో ఏమీ సంపాదించలేదు’ అని బొల్లినేని రామారావు చెప్పారు.
Also Read
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
Also Read: Minister Roja: ఊగిపోయి గట్టిగా మాట్లాడితే ఓట్లు రావు.. పవన్ కళ్యాణ్పై మంత్రి రోజా సెటైర్లు!
‘నాకు టికెట్టు ఇవ్వకపోవడం వల్ల బాధపడటం లేదు. కానీ నా పట్ల పార్టీ వ్యవహరించిన తీరు పట్ల బాధపడుతున్నా. ఆఖరి ప్రయత్నంగా చంద్రబాబును కలుస్తాను. నేతలు, కార్యకర్తల ఆవేదనను ఆయన ముందు ఉంచుతాను. నేను వ్యాపారాలు చేసి బాగా సంపాదించుకునే అవకాశం ఉంది. కానీ జిల్లాలోనే బాగా వెనుకబడిన నా ఉదయగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేది నా సంకల్పం. ఎన్నికలకు కేవలం 45 రోజులు మాత్రమే ఉంది. కొత్త వారు వచ్చి ఇక్కడ ఏం చేస్తారు. నాకంటే కొత్త అభ్యర్థికి ఏమి అదనపు అర్హతలు ఉన్నాయి’ అని బొల్లినేని రామారావు ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Karuppu Release : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘కరుప్పు’ రిలీజ్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్
-
నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
-
Sarah Taylor: చారిత్రక నిర్ణయం.. పురుషుల జట్టుకు తొలి మహిళా కోచ్ గా సారా టేలర్..
-
Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
-
Israeli base in Iraq: ప్రపంచ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు.. ఇరాక్లో ఇజ్రాయెల్ రహస్య స్థాపరం..!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!