Bollineni Ramarao: ఆఖరి ప్రయత్నంగా చంద్రబాబుని కలుస్తా.. ఆవేదనను బాబు ముందు ఉంచుతా: బొల్లినేని రామారావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘చంద్రబాబు అన్నా.. తెలుగుదేశం పార్టీ అన్నా నాకు ప్రాణం. ఇతర పార్టీల నేతలు కూడా నాతో మాట్లాడారు కానీ స్పందించలేదు. 14 నాలుగు సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నా. పక్కన నియోజక వర్గ నేతలకు ఇచ్చిన గౌరవం కూడా నాకు ఇవ్వలేదు. నేను ఆవేదనతో మాట్లాడుతున్నా. దళారీలను పక్కనపెట్టి చంద్రబాబు నేరుగా నివేదిక తీసుకోవాలి. అప్పుడే వాస్తవాలు తెలుస్తాయి. చంద్రబాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించాను కానీ వీలు కాలేదు. వచ్చే నెల 2న నెల్లూరుకు వస్తున్న చంద్రబాబుతో కలుస్తాను. ఆయన ఏమి చెబుతారో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటా. ఆయన చెప్పిన విషయాన్ని మీ ముందు ఉంచుతాను. మీరు ఏమి చెబితే అది చేస్తా. మనకు అంతా మంచి జరగాలనే ఆశిస్తా. ఎవరు బాధపడాల్సిన పని లేదు’ అని టీడీపీ సీనియర్ నేత బొల్లినేని రామారావు అన్నారు.
‘నా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదు. టికెట్ ఇవ్వలేమని నాకు ముందే చెప్పి ఉంటే నేను తూచా తప్పకుండా పాటించేవాడిని. కానీ గౌరవించకపోవడం పట్ల బాధ కలుగుతోంది. స్థానిక నేతలు ఎవరికీ తెలియకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నా. 2012 ఉప ఎన్నికల్లోఎవరూ ముందుకు రాకపోతే.. చంద్రబాబు నన్ను పోటీ చేయమన్నారు. అప్పుడు పోటీ చేసి ఓడిపోయా. అప్పటినుంచి సొసైటీ, స్థానిక సంస్థల ఎన్నికలు కోసం ఆర్థికంగా సాయం చేశా. 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి.. ఉదయగిరిలో ఎన్నో మంచి పనులు చేశాను. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, వెంకయ్యనాయుడు సహకారంతో అభివృద్ధి చేశా. నేను ఎక్కడా తప్పు చేయలేదు. రాజకీయాల్లో ఏమీ సంపాదించలేదు’ అని బొల్లినేని రామారావు చెప్పారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
Also Read: Minister Roja: ఊగిపోయి గట్టిగా మాట్లాడితే ఓట్లు రావు.. పవన్ కళ్యాణ్పై మంత్రి రోజా సెటైర్లు!
‘నాకు టికెట్టు ఇవ్వకపోవడం వల్ల బాధపడటం లేదు. కానీ నా పట్ల పార్టీ వ్యవహరించిన తీరు పట్ల బాధపడుతున్నా. ఆఖరి ప్రయత్నంగా చంద్రబాబును కలుస్తాను. నేతలు, కార్యకర్తల ఆవేదనను ఆయన ముందు ఉంచుతాను. నేను వ్యాపారాలు చేసి బాగా సంపాదించుకునే అవకాశం ఉంది. కానీ జిల్లాలోనే బాగా వెనుకబడిన నా ఉదయగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేది నా సంకల్పం. ఎన్నికలకు కేవలం 45 రోజులు మాత్రమే ఉంది. కొత్త వారు వచ్చి ఇక్కడ ఏం చేస్తారు. నాకంటే కొత్త అభ్యర్థికి ఏమి అదనపు అర్హతలు ఉన్నాయి’ అని బొల్లినేని రామారావు ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!