Demon: సినీ ప్రేక్షకులను భయబ్రాంతులకు బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ “డీమన్” ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. రమేశ్ పళనీవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లింగ్ కథా చిత్రం గురువారం (మే 29) నుండి ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ ఆహా (Aha) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం భవాని మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. సచిన్ మణి, అబర్నతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో సురుతి పేరియసామి, కుంకి అశ్విన్, రవీనా వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించి తమ నటనతో అలరించారు. భయానకత, ఉత్కంఠ, మిస్టరీ, అనూహ్య మలుపులతో కూడిన కథనం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
Read Also: Gaddar Awards: 14 ఏళ్ల తర్వాత సినిమా అవార్డుల సంబరం.. గద్దర్ పేరుతో సినీ పురస్కారాలు..!
కథా నిర్మాణాన్ని మరింత బలపరుస్తూ రోనీ రాఫెల్ అందించిన నేపథ్య సంగీతం, ఆర్.ఎస్. ఆనందకుమార్ తీసిన విజువల్స్, రవికుమార్ ఎం. చేసిన కట్టింగ్ ఎడిటింగ్ సినిమాకు అత్యున్నత స్థాయి టెక్నికల్ హంగులను జతచేశాయి. వీకెండ్ను ఉత్కంఠభరితంగా గడపాలనుకుంటున్నవారికి “డీమన్” చిత్రం ఓ మంచి ఎంపిక. హారర్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వారికి ఈ చిత్రం నేటి నుండి ఆహా ఓటీటీలో వీక్షించవచ్చు.
Read Also: Seetha Payanam: తండ్రి డైరక్షన్లో హీరయిన్గా ఎంట్రీ ఇస్తున్న కూతురు.. టీజర్ రిలీజ్..!
