DK Aruna : ప్రపంచంలోనే ఝూట అవార్డ్ ఇవ్వాలంటే అది కేసీఆర్కే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Women Leader DK Aruna Fires on CM KCR
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. రానున్న దసరాలోపే జాతీయ పార్టీని ప్రకటించనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు అంటున్న నేపథ్యంలో.. తాజాగా నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభమయ్యాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలపై చర్చ జరిగింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు స్పందిస్తూ.. బీజేపీ పేరు తలవనిదే కేసీఆర్కు నిద్ర రాని పరిస్థితి ఉందని ఆమె విమర్శించారు. అంతేకాకుండా.. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ గొంతు చించుకుంటున్నాడని, ప్రపంచంలోనే ఝూట అవార్డ్ ఇవ్వాలంటే అది కేసీఆర్ కే ఇవ్వాలి అంటూ ఆమె మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ అన్ని అబద్దాలు మాట్లాడుతున్నారని, మా ఎమ్మెల్యేలను 3 తోకలు అంటావా?.. నీకు దమ్ము, ధైర్యం ఉంటే… మా ముగ్గురు ఎమ్మెల్యేలను ఎందుకు అసెంబ్లీ నుంచి బయటికి పంపించావ్.. కేసీఆర్ చెప్పేవన్ని ఝూటా మాటలే.. కేసీఆర్ వి అన్నీ పచ్చి అబద్దాలే.. ఎక్కడ ఎలక్షన్ వస్తే… అక్కడ కరెంట్ మీటర్లు అంటాడు.. దుబ్బాక, హుజురాబాద్ ఎలక్షన్స్ లో ప్రజలు బుద్ది చెప్పినా.. కేసీఆర్ కు సిగ్గు రాలేదు.. ప్రజలు బీజేపీ కి ఓటు వేసి, కేసీఆర్ కే మీటర్లు పెట్టారు..
Also Read
- Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
- MP Uday Srinivas: 'జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం'.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
- Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే 'పెసర లడ్డూలు'.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
- Andhra Pradesh Rain Alert: ద్రోణి, తుఫాన్ ఆవర్తనం ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే, జాతీయ పార్టీ అంటూ… ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు.. రియల్ ఎస్టేట్ పేరుతో దండుకుంటున్నారు.. కాళేశ్వరం పేరుతో కోట్ల అవినీతికి పాల్పడ్డారు.. నియంత పాలనను బీజేపీ అంతం చేస్తుంది.. తెలంగాణ ప్రజల ఆకాంక్షను బీజేపీ నెరవేరుస్తుంది.. కేంద్ర మంత్రులు నూకలు తినమన్నారని, ధగాకోరు మాటలు మాట్లాడుతున్నారు కేసీఆర్, కేటీఆర్.. తెలంగాణ లో బీజేపీ బలోపేతం అయింది.. భారత్ జోడో కాదు.. ముందు రాహుల్ గాంధీ తన పార్టీ ని జోడో చేసుకోవాలి.. మోదీ పాలనలో భారత్ చాలా బాగుంది.. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కార్యకర్తలు ఎలా గెలిపించుకున్నారో… మునుగోడు ఎన్నికలో కూడా రాజగోపాల్ రెడ్డిని అలానే గెలిపించాలని విజ్ఞప్తి అని ఆమె వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
-
Family Vacation: యూరప్ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్కు బెస్ట్!
-
MP Uday Srinivas: ‘జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం’.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
-
TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్డేట్, ధరలు ఇవే!
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!