Somu Veerraju: 8న రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు.. ఏపీ అభివృద్ధే ప్రధాన ఎజెండా..
- ఈనెల 8వ తేదీన రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు..
- రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి అధ్యక్షతన భేటీ..
- రాష్ట్ర వ్యాప్తంగా 2250 మంది రాష్ట్ర స్థాయి నుండి మండల స్థాయి నేతలు వరకు పాల్గొంటారు..
- ఏపీ అభివృద్దే ప్రధాన అజెండాగా చర్చిస్తామన్న సోము వీర్రాజు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju: ఈనెల 8వ తేదీన రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి అధ్యక్షతన సమావేశాలు జరుగుతాయని అన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా 2250 మంది రాష్ట్ర స్థాయి నుండి మండల స్థాయి నేతలు వరకు పాల్గొంటారని చెప్పారు. కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ ముఖ్య అతిథిగా, రాజ్యసభ సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి పాల్గొంటారని అన్నారు. ఏపీ అభివృద్దే ప్రధాన అజెండాగా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చిస్తామని, ప్రజల అభీష్టం మేరకే బీజేపీ వైఖరి ఉంటుందని అంటున్నారు.. డిపోయిన రాష్ట్రానికి అభివృద్ధి కోసం బీజేపీ పనిచేస్తుందని డబుల్ ఇంజన్ సర్కార్ పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చి, అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.
Read Also: Chhattisgarh : బావిలో పడిన వ్యక్తిని రక్షించే క్రమంలో గ్యాస్ లీక్ కారణంగా నలుగురు మృతి
Also Read
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
ఇక, జగన్ వేసిన అవినీతి బీజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని విమర్శించారు సోము వీర్రాజు.. జగన్ పాపాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయని ఆయన.. కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం దందా బయట పెట్టిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు అభినందనలు తెలియజేశారు. మరోవైపు.. రాహుల్ గాంధీపై ధ్వజమెత్తుతూ.. రాహుల్ కి 100 స్థానాలు వచ్చాయి. ఆయన మాట్లాడే భాష, విజయం సాధించాం అనట్టుగా ఉందని దుయ్యబట్టారు.. విభిన్నమైన ఆలోచన గల పార్టీ బీజేపీగా పేర్కొన్నారు.. క్రైస్తవులు కొన్ని రాష్ట్రాల్లో ఉపముఖ్యమంత్రిగా ఉన్న బీజేపీపై బిన్న అభిప్రాయాలు ఉన్నాయని అన్నారు. కాశ్మీర్ లో జాతీయ పతాకం ఎగురవేయ్యలేనట్టువంటి పార్టీ కాంగ్రెస్ అని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు బీజేపీకి కాంగ్రెస్ చెప్పాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. రాముడే హీరో, అలాంటిది కాంగ్రెస్ రాముడి గుడి కాకుండా బాబర్ గుడి నిర్మించాలని రాహుల్ అంటున్నారని విమర్శించారు. రాముడు ప్రజల మనిషి, బీజేపీ వారు కాదు, స్వభిమానానికి చిహ్నం రాముడు అని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగం కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సోనియా గాంధీ ఇటలీ, ఆమె కుమారుడు రాహుల్ రాజ్యాంగం కోసం మాట్లాడతారని విమర్శించారు. ఇండియాలో జాతీయ జెండాలను ఎగుర వేయని పార్టీ కాంగ్రెస్ అని, కాశ్మీర్ లో ఇండియా జాతీయ జెండాను ఎగురవేసిన పార్టీ బీజేపీ అంటూ కొనియాడారు సోము వీర్రాజు.
- Tags
తాజావార్తలు
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!