Karnataka: కర్ణాటక గూండాల రాష్ట్రంగా మారింది.. అసెంబ్లీలో తీవ్ర వాగ్వాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: శాంతిభద్రతల పరిస్థితిపై కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. కర్ణాటక గూండాల రాష్ట్రంగా మారిందని ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఆరోపించింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం బతికే ఉందా, చచ్చిందా అని బీజేపీ నేతలు ప్రశ్నించారు.
కర్ణాటక అసెంబ్లీలో వాడివేడి చర్చ
సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ ఎమ్మెల్యేలు ఇచ్చిన వాయిదా నోటీసు ఆధారంగా శాంతిభద్రతలపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత సభలో తీవ్ర వాగ్వాదం జరగగా, బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను బీజేపీ నేత లేవనెత్తారు. ఇటీవల బెళగావిలో మహిళలను నగ్నంగా ఊరేగించడం, హవేరీ గ్యాంగ్ రేప్, సైబర్ క్రైమ్, టెర్రర్ సంబంధిత కార్యకలాపాల కారణంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ అన్నారు. దీనిపై చర్చ జరగాలి. ఈ విషయం గత సెషన్లో జాబితా చేయబడింది, కానీ చర్చించలేకపోయిందని మండిపడ్జారు.
Also Read
- Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
Read Also: Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల కోసం “ఎంఎస్పీ” చట్టం..
బీజేపీ ఆరోపణలపై ప్రభుత్వం ఏం చెప్పింది?
అసెంబ్లీలో జరిగిన గందరగోళాన్ని చూసిన రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వర మాట్లాడుతూ.. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తడానికి ప్రభుత్వం వ్యతిరేకం కాదని, ప్రశ్నోత్తరాల సమయం తర్వాత లేవనెత్తాలని అన్నారు. శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనే ఆరోపణలపై ప్రభుత్వం స్పందిస్తుందని, అలాగే బీజేపీ హయాంలో జరిగిన హత్యలు, సంఘ వ్యతిరేక వ్యక్తులు బహిరంగంగా ఆయుధాలను ఎలా ఉపయోగించారో కూడా తెలుసని ఆయన పేర్కొన్నారు. ఆర్.అశోక్కు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ.. హవేరీ గ్యాంగ్ రేప్ కేసులో సంబంధం లేని వ్యక్తులపై కేసు నమోదైనందున ఈ కేసు చాలా ముఖ్యమైనదని అన్నారు. మాండ్యాలో హనుమాన్ జెండా ఎగురవేసే విషయంలో సరిగ్గా అదే జరిగిందని.. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో అరాచక వాతావరణం కనిపిస్తోందని బీజేపీ నేత అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
-
Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!