Rajasthan: రాజస్థాన్ ఎన్నికల నిర్వహణ, మేనిఫెస్టో కమిటీలో లేని సీనియర్ నేత పేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్డీఏ ఎప్పటికప్పుడు రూపకల్పనలు చేస్తుంది. అందులో భాగంగా రాజస్థాన్ లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల నిర్వహణ కమిటీని, సంకల్ప్ (మేనిఫెస్టో) కమిటీని బీజేపీ ఏర్పాటు చేసింది. అయితే అందుకు సంబంధించి పేర్లను ప్రకటించింది. ఈ రెండు కమిటీల్లోనూ రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నేత వసుంధర రాజే పేరు లేదు. ఇదేంటని బీజేపీని ప్రశ్నించగా.. ప్రతి ఒక్కరికీ ఒక్కో పాత్ర ఇస్తున్నట్లు పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ నేత, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ‘వసుంధర రాజే మా సీనియర్ నాయకురాలు. ఎప్పటినుంచో ఎన్నో కార్యక్రమాల్లో ఆమేను చేర్చుకున్నాం, కొనసాగిస్తాం. అని తెలిపారు.
Flags: నిజమైన దేశభక్తి అంటే ఇది… శభాష్ రా బుడ్డోడా
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
- Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
రాజస్థాన్ లో బీజేపీ.. ఎవరికి ఏ బాధ్యత ఇచ్చిందంటే..? కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ను ‘ప్రదేశ్ సంకల్ప్ పత్ర సమితి’ కన్వీనర్గా నియమించారు. ఈ కమిటీలో రాజ్యసభ సభ్యులు ఘనశ్యాం తివారీ, కిరోరి లాల్ మీనా, జాతీయ మంత్రి అల్కా సింగ్ గుర్జార్, మాజీ డిప్యూటీ స్పీకర్ రావు రాజేంద్ర సింగ్, కేంద్ర మాజీ మంత్రి సుభాష్ మహరియా, మాజీ మంత్రులు ప్రభు లాల్ సైనీ, రాఖీ రాథోడ్లు కో-కన్వీనర్లుగా నియమితులయ్యారు.
రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్గా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణ్ పంచారియా నియమితులయ్యారు. ఇందులో పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఓంకార్సింగ్ లఖావత్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భజన్లాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ అగర్వాల్, సమాచార శాఖ మాజీ కమిషనర్ సీఎం మీనా, కన్హయ్య లాల్ బైర్వాల్లకు కో-కన్వీనర్లుగా బాధ్యతలు అప్పగించారు.
తాజావార్తలు
-
Ntv Exclusive: ‘పెద్ది’తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
-
Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
-
PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!