BJP: జోరు పెంచిన కమలం.. 4 కీలక రాష్ట్రాలకు ఇంఛార్జ్ల నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Ramps Up Poll Preperations: ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ శుక్రవారం ఎన్నికల ఇన్ఛార్జ్లను ప్రకటించింది. వచ్చే ఏడాది అన్నింటికంటే ముఖ్యమైన లోక్సభ ఎన్నికలకు కూడా వారే ఇన్ఛార్జులుగా వ్యవహరిస్తారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు పంజాబ్, తెలంగాణ, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్లకు బీజేపీ కొత్త రాష్ట్రాల చీఫ్లను నియమించిన మూడు రోజుల తర్వాత ఈ చర్య వచ్చింది.
ఈ నాలుగు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్లో మాత్రమే బీజేపీ ప్రభుత్వం ఉంది. ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడినప్పటి నుంచి భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వాన్ని కలిగి ఉంది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి రాజస్థాన్ ఎన్నికల ఇన్ఛార్జ్గా నియమితులయ్యారు, గుజరాత్ మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, హర్యానా నుంచి కుల్దీప్ బిష్ణోయ్ కో-ఇన్చార్జ్లుగా ఉన్నారు. మధ్యప్రదేశ్కు ఇద్దరు కేంద్ర మంత్రులకు ఇన్ఛార్జ్లు ఇచ్చారు. భూపేందర్ యాదవ్ను ఇన్ఛార్జ్గా నియమించారు, అశ్విని వైష్ణవ్ కో-ఇన్చార్జ్గా ఉన్నారు.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
Also Read: Falaknuma Express Train: వారంలో ప్రమాదం అని హెచ్చరిక లేఖ.. అదే నిజమైందా?
ఛత్తీస్గఢ్లో బీజేపీ సీనియర్ నాయకుడు ఓం ప్రకాష్ మాథుర్ను ఇన్ఛార్జ్గా ఉంచింది. అతనికి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా సహాయం చేయనున్నారు. తెలంగాణ ఇన్ఛార్జ్గా కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ను నియమించారు. కో-ఇన్చార్జ్గా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ను నియమించారు.ఈ ఏడాది మిజోరంలో కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది.
తెలంగాణలో ప్రజల మూడ్ బీజేపీకి అనుకూలంగా ఉందని, తాము ఎన్నికల్లో గెలుస్తామని ప్రకాష్ జవదేకర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని, ఆయన ప్రభుత్వంపై అక్కడి ప్రజలు, ఓటర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. గత తొమ్మిదేళ్లుగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంతకుముందు ఆరోపించారు. రేపు రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను తమ పార్టీ బహిష్కరిస్తుందని ఆయన అన్నారు.
నాలుగు రాష్ట్రాలకు నియమించబడిన ఎన్నికల ఇన్ఛార్జ్లు వీరే..
*రాజస్థాన్
ప్రహ్లాద్ జోషి – ఎన్నికల ఇన్చార్జి
నితిన్ పటేల్ – కో-ఇంఛార్జి
కుల్దీప్ బిష్ణోయ్ – కో-ఇంఛార్జి
*ఛత్తీస్గఢ్
ఓం ప్రకాష్ మాథుర్ – ఎన్నికల ఇన్చార్జి
మన్సుఖ్ మాండవియా – కో-ఇంఛార్జి
*తెలంగాణ
ప్రకాష్ జవదేకర్ – ఎన్నికల ఇన్చార్జి
సునీల్ బన్సాల్ – కో-ఇంఛార్జి
*మధ్యప్రదేశ్
భూపేంద్ర యాదవ్ – ఎన్నికల ఇన్చార్జి
అశ్విని వైష్ణవ్ – కో-ఇంఛార్జి
తాజావార్తలు
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..