Falaknuma Express Train: వారంలో ప్రమాదం అని హెచ్చరిక లేఖ.. అదే నిజమైందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Is there any conspirancy behind Falaknuma Express Train accident: ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య ఉదయం 11 గంటలకు బెంగాల్ నుంచి సికింద్రాబాద్ కు వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ట్రైన్ లోని ఒక బోగీలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇక ఈ క్రమంలో ఆ బోగీలో ఉన్న వారు గమనించి వెంటనే చైన్ లాగడంతో అప్రమత్తమైన లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేశాడు. దీంతో బోగీలో ఉన్న ప్యాసింజర్లు ట్రైన్ లో నుంచి కిందకు దూకి ట్రైన్ నుంచి దూరంగా పారిపోయారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు మిగతా బోగీల్లో ఉన్న ప్రయాణికులను దించి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక ముందే అప్రమత్తం అవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది అని రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే మంటలను ఆర్పే సిబ్బంది వచ్చేలోపే మిగతా బోగీలకు కూడా క్రమంగా నిప్పు అంటుకోవడంతో ఆ ఏరియాలో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి.
Bedurulanka 2012: ఆగస్టు 25న కార్తికేయ, నేహా శెట్టిల ‘బెదురులంక 2012’
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
ఐదు బోగీలు మంటల్లో పూర్తిగా కాలిపోయినట్లు పేర్కొన్న అధికారులు ఒక బోగి మాత్రం పాక్షికంగా కాలిపోయిందని తెలిపారు. అయితే ఈ నేపథ్యంలో సరిగ్గా వారం క్రితం సికింద్రాబాద్ రైల్వే అధికారులకు వచ్చిన బెదిరింపు లేఖ గురించి చర్చ జరుగుతోంది. వచ్చే వారం హైదరాబాద్-ఢిల్లీ-హైదరాబాద్ మార్గంలో ‘బాలాసోర్ తరహా రైలు ప్రమాదం’ జరుగుతుంది అని హెచ్చరిస్తూ దక్షిణ మధ్య రైల్వేకు జూన్ 30న ఒక లేఖ వచ్చింది. బాలాసోర్ తరహా ఘోర దుర్ఘటన జరగబోతోందని అంటూ సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులకు ఆ బెదిరింపు లేఖ అందింది. గుర్తు తెలియని వ్యక్తి ఈ లేఖను రైల్వే అధికారులకు పంపించాడని హైదరాబాద్- ఢిల్లీ మార్గంలో ఈ ప్రమాదం జరగనుందని, ఇది విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం అని చెబుతూ ఈ లేఖను రాశారు. ఆ లేఖలో చెప్పినట్టు కాకపోయినా రైలు ప్రమాదం జరగడం సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!