Delhi: బీజేపీలో చేరకపోతే మమల్ని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తన పేరు రావడంతో మంత్రి అతిషి ఇవాళ స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి అతిషి మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై సంచలన ఆరోపణలు చేశారు. తనకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ద్వారా కమలం పార్టీ తనను సంప్రదించిందని తెలిపింది. బీజేపీలో చేరకుంటే నెల రోజుల్లో అరెస్ట్ చేస్తామని చెప్పారని ఆమె చెప్పుకొచ్చింది. తనతో పాటు సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్, రాఘవ్ చద్దాలను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని అతడి ద్వారి బీజేపీ పేర్కొనింది అని మంత్రి అతిషి వెల్లడించింది. అయితే, ముందుగా ఆప్ అగ్రనేతలను అరెస్టు చేశారు.. ఇక, లోక్ సభ ఎన్నికలకు ముందు మరో నలుగురు ఆప్ నేతలను అరెస్ట్ చేయాలని బీజేపీ భావిస్తోంది అని మంత్రి అతిషి వెల్లడించింది.
Read Also: Bandi Sanjay: ప్రారంభమైన బండి సంజయ్ రైతు దీక్ష.. మద్దతు తెలపాలని పిలుపు..!
Also Read
- YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
- India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
- Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
- SS Rajamouli: "ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది".. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
అయితే, సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ విచ్ఛిన్నమవుతుందని బీజేపీ ఊహించిందని మంత్రి అతిషి అన్నారు. ఆదివారం నాడు రాంలీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు అని తెలిపింది. ఇక, ఆప్ కి చెందిన నలుగురు నేతలను అరెస్ట్ చేయడం సరిపోదని.. ఇప్పుడు మరో నాలుగురిని అరెస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తుందని ఆమె ఆరోపించారు. మరి కొన్ని రోజుల్లో ఈడీ, సీబీఐ ఆప్ నేతలకు సంబంధించిన పలువురిని అరెస్ట్ చేయాలని బీజేపీ చూస్తుందని మంత్రి అతిషి చెప్పుకొచ్చింది.
Read Also: MLC Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబును అడ్డుకున్న దళితులు.. అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం..
ఇక, సోమవారం నాడు ఈడీ అధికారులు సీఎం కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. విజయ్ నాయర్తో ఉన్న సంబంధాల గురించి కేజ్రీవాల్ను ప్రశ్నించగా.. నాయర్ తనకు నివేదించలేదు.. అతిషి, సౌరభ్లకు నివేదించారని కేజ్రీవాల్ చెప్పినట్లు ఈడీ తెలిపింది. లిక్కర్ కుంభకోణంలో అతిషి, సౌరభ్ భరద్వాజ్ పేర్లను కూడా ఈడీ ప్రస్తావించడం ఇదే తొలిసారి. ఇక, దీనిపై నిన్న ( సోమవారం ) మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ లు స్పందించలేదు.
తాజావార్తలు
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
-
Ram Charan : RC 17.. ఓ చిన్న కన్ఫ్యూజన్
-
Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
-
SS Rajamouli: “ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది”.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
ట్రెండింగ్
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!