TBJP: “ఇది క్రమశిక్షణారాహిత్యానికి పరాకాష్ఠ”.. రాజా సింగ్ రాజీనామాపై బీజేపీ సంచలన ప్రకటన..!
Raja Singh:బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ విషయంలో తెలంగాణ బీజేపీ పార్టీ కీలక ప్రకటన చేసింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ క్రమశిక్షణారాహిత్యం పరాకాష్ఠకు చేరిందని, రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నికలలో రాజాసింగ్ కూడా నామినేషన్ వేస్తానని పార్టీ కార్యాలయానికి వచ్చారని తెలిపింది. ఆ సమయంలో విషయమై జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ అభయ్ పాటిల్ రాజాసింగ్ చర్చించారు. ఇక రాజాసింగ్ కోరిక మేరకు నామినేషన్ పత్రాలు ఇచ్చి నామినేషన్ వేసుకునే అవకాశం ఇచ్చారని తెలిపింది.
Read Also:BSNL: ఫ్లాష్ సేల్.. రూ.400కే 400GB డేటా.. త్వరపడండి..!
Also Read
- Bellamkonda Sreenivas: ఒక ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.. మెగాస్టార్కు తొలి ఆహ్వానం!
- Rajnikanth173 : సస్పెన్స్ వీడింది.. రజనీకాంత్ను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరంటే ?
- Chidambaram: పోలింగ్ ప్రారంభంలోనే ఓటేసిన పి.చిదంబరం
- Star Directors : బ్రేక్ తీసుకుంటోన్న స్టార్ డైరెక్టర్స్.. కారణాలు ఏంటో?
అలాగే రాష్ట్ర ఎన్నికల అధికార శోభా కరండ్లాజేకి 10 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల మద్దతుతో నామినేషన్ ఫామ్ సమర్పించవలిసి ఉండగా, వారు కేవలం ముగ్గురు సభ్యుల సంతకాలతో ఉన్న ఫామ్ మాత్రమే సమర్పించినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధన ప్రకారం.. రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికలలో పోటీ చేయడానికి 10 మంది స్టేట్ కౌన్సిల్ సభ్యుల సంతకాలతో మరో ఫామ్ సమర్పించవలిసిందిగా శ్రీమతి శోభా కరండ్లాజే రాజాసింగ్ కోరారు. అయితే, రాజాసింగ్ నామినేషన్ కి మద్దతిచ్చే స్టేట్ కౌన్సిల్ సభ్యులు లేక చేతులెత్తేసి పార్టీ పోటీ చేయనివ్వట్లేదని అబద్ధాలతో పార్టీపై అభాండాలు వేస్తున్నట్లు తెలిపింది. పార్టీ అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డికి సమర్పించిన రాజీనామా పత్రాన్ని ఆయన జాతీయ అధ్యక్షుడికి పంపించడం జరుగుతుందని తెలిపింది.
Read Also:Vivo X200 FE: ధరే కాదు భయ్యా.. ఫీచర్లు కూడా ఘనమే.. వివో నుంచి కొత్త మొబైల్ లాంచ్..!
రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్ కు రాజీనామా లేఖ సమర్పించాలని, పార్టీకంటే ఎక్కువ ఎవరూ కాదని బీజేపీ పార్టీ పేర్కొంది. గతంలో కూడా ఇలాంటి క్రమశిక్షణారాహిత్య వ్యవహారాలతో సస్పెండ్ అయితే మళ్లీ పార్టీలోకి తీసుకున్నామని.. ప్రధానమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షులు వారి నియోజకవర్గానికి వచ్చినా సరే వారి కార్యక్రమాలకు హాజరుకాకుండా పార్టీ కంటే తానే సుప్రీం అన్నట్లుగా ఉంది రాజాసింగ్ వ్యవహారమని పార్టీ తెలిపింది. మా పార్టీకి వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం. పార్టీ క్రమశిక్షణను అనేకసార్లు రాజాసింగ్ ఉల్లంఘించినట్లు తెలిపింది. చివరకు ఈరోజు వారే రాజీనామా చేసారని పార్టీ ప్రకటించింది.
తాజావార్తలు
-
Bellamkonda Sreenivas: ఒక ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.. మెగాస్టార్కు తొలి ఆహ్వానం!
-
Rajnikanth173 : సస్పెన్స్ వీడింది.. రజనీకాంత్ను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరంటే ?
-
Ravindra Jadeja: ఆమె చెప్పిందే నిజమైంది.. ఈ అవార్డు నా ప్రియమైన మంత్రికి అంకితం!
-
Chidambaram: పోలింగ్ ప్రారంభంలోనే ఓటేసిన పి.చిదంబరం
-
Star Directors : బ్రేక్ తీసుకుంటోన్న స్టార్ డైరెక్టర్స్.. కారణాలు ఏంటో?
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?