Kangana Ranaut: ప్రచారం ప్రారంభించిన రోజే కాంగ్రెస్పై విసుర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటి, మండి బీజేపీ లోక్సభ అభ్యర్థి కంగనా రనౌత్ శుక్రవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. హిమాచల్ప్రదేశ్లోని మండి నియోజకవర్గానికి కంగనా చేరుకోగానే బీజేపీ కార్యకర్తలు, నేతలు భారీ స్వాగతం పలికారు. ఆమెపై పూల వర్షం కురిపించారు. అనంతరం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా ఆమెకు ప్రజలు, మహిళలు బ్రహ్మరథం పట్టారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తనకు బీజేపీ సీటు ప్రకటించగానే కాంగ్రెస్ నాయకులు చౌకబారు రాజకీయలు చేశారని ధ్వజమెత్తారు. తన అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ ఏ మాత్రం అంగీకరించలేదని చెప్పుకొచ్చారు. ఇక రాహుల్ గాంధీ అయితే హిందువుల్లోని ‘శక్తి’పై, మహిళలను గురించి కించపరిచే వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులకు మహిళలంటే గౌరవం లేదని కంగనా విమర్శించారు. కాంగ్రెస్ నీచమైన రాజకీయాలకు తెరలేపిందని ఆమె వ్యాఖ్యానించారు.
Also Read
హిమాచల్ ప్రదేశ్లోని మండి స్థానం నుంచి కంగనా రనౌత్ను బీజేపీ ఎన్నికల బరిలోకి దించింది. ఈ క్రమంలో కంగనా అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనాథే సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టు చేశారు. రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. అనంతరం ఆమె ట్వీట్కు కంగనా ధీటుగా బదులిచ్చారు. అయితే ఆ పోస్టు తాను చేయలేదని.. తన సోషల్ మీడియా అకౌంట్ యాక్సెస్ కలిగిన ఎవరో చేసి ఉంటారని సుప్రియా వివరణ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: R Krishnaiah: సీఎం జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు..
ఇక కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనాథేకు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మహిళలను కించపరిచేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈసీ ఈ చర్యలు చేపట్టింది. మార్చి 29 సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఈసీ పేర్కొంది.
ఇక దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఇక చివరి విడత జూన్ 1న జరగనుంది. ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. అన్ని పార్టీలు విజయం కోసం ప్రచారంలో దూసుకుపోతున్నాయి. వికసిత్ భారత్ కోసం ఎన్డీఏకు 400 సీట్లు ఇవ్వాలని ప్రధాని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: Sriranga Neethulu : సుహాస్ ‘ శ్రీరంగనీతులు ‘ ట్రైలర్ వచ్చేసింది..
#WATCH | Himachal Pradesh: BJP candidate from Mandi Lok Sabha seat, actor Kangana Ranaut says, "… Congress could not accept my nomination from Mandi. They started doing cheap politics. Their leader Rahul Gandhi talks about destroying the 'shakti' in Hindus. Their spokesperson… pic.twitter.com/D53fySekCz
— ANI (@ANI) March 29, 2024
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!