Maheshwar Reddy: రేవంత్రెడ్డికి కేసీఆర్ వెన్నంటి ఉన్నారు.. బీజేఎల్పీ నేత సంచలన వ్యాఖ్యలు..
- కేసీఆర్, రేవంత్రెడ్డిపై సంచలన ఆరోపణలు
- రేవంత్రెడ్డికి కేసీఆర్ వెన్నంటి ఉన్నారు
- ప్రభుత్వానికి కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నారు
- బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యా్ఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కేసీఆర్, రేవంత్రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఉరితీసిన తప్పులేదని మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడినా.. రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రేవంత్రెడ్డికి కేసీఆర్ వెన్నంటి ఉన్నారని స్పష్టం అవుతుందని.. రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నారని మహేశ్వర్రెడ్డి ఆరోపించారు.. 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగాలని కేసీఆర్ అంటున్నారని.. అంటే ఆ రెండు పార్టీలు ఒకటే నని స్పష్టం అవుతుందన్నారు. నిన్న రజతోత్సవ సభలో కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత స్పందించారు. కేసీఆర్ సభ కొండంత రాగం తీసి దిక్కుమాలిన పాట పాడినట్టుగా ఉందని విమర్శించారు. తెలంగాణ విధ్వంసానికి కారణం కేసీఆర్ అన్నారు. సభకోసం రూ.150 కోట్లు ఖర్చు చేసి కనీసం లక్ష మందిని కూడా జమ చేయలేక పోయారని ఆరోపించారు.
READ MORE: Road Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
“సభ అట్టర్ ఫ్లాప్ అయింది. తెలంగాణ కు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది కేసీఆర్ నీకు తెలియదా? అన్ని తెలిసి 11 రూపాయలు కూడా ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. మీరు పాలివ్వలేదని తెలిసే మిమ్మల్ని ప్రజలు ఓడించారు. మావోయిస్టులను చర్చలకు పిలువలేదు కేసీఆర్… మీ ప్రభుత్వంలో ఎన్కౌంటర్ లు చేయలేదా? హింసను వీడనాడి జన జీవనంలోకి రావాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చెయ్యి.. అధికారం కోల్పోయి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు… గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపి ఆ తరవాత వాళ్ళను చంపింది నిజం కాదా… ఆ ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వాములే కదా? తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అని పగటి కలలు కంటున్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు అసహ్యించుకుంటారు తప్ప మిమ్మల్ని అక్కున చేర్చుకోరు. బీర్ఎస్ మోడల్ అంటే దుర్మార్గం, కుటుంబ పాలన, విధ్వంసం, అరాచకం. కాళేశ్వరం గురించి కెసిఆర్ ఎందుకు మాట్లాడరు. అది ఎత్తిపోతల పథకం కాదు, తిప్పి పోతల పథకం.” అని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
READ MORE: Preity Zinta: ఐపీఎల్ మధ్యలో భర్తతో కలిసి చిల్ అవుతున్న పంజాబ్ ఓనర్
తాజావార్తలు
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!