Kangana Ranaut: ‘పార్టీ విధానపరమైన అంశాలపై మాట్లాడేందుకు అనుమతి లేదు’.. కంగనా పై బీజేపీ ఫైర్
- బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు
- తీవ్రంగా మండిపడ్డ విపక్షాలు
- తాజాగా ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన బీజేపీ
- విధానపరమైన అంశాలపై మాట్లాడేందుకు అనుమతి లేదని స్పష్టం
- ఈ వ్యాఖ్యలు తన వ్యక్తి గతమన్న బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్లోని మండి లోక్సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రైతుల ఉద్యమం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటన తర్వాత.. ప్రతిపక్షాలు బీజేపీని తీవ్రంగా లక్ష్యంగా చేసుకుని కంగనాపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. పెరుగుతున్న వివాదాల మధ్య కంగనా చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. భవిష్యత్తులో అలాంటి ప్రకటన చేయకూడదని కంగనాను హెచ్చరించింది.
READ MORE: Ongole: అమ్మతనానికి కలంకం.. పది వేలకు శిశువును అమ్మకానికి పెట్టిన తల్లి
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
వాస్తవానికి.. బీజేపీ అగ్రనాయకత్వం బలంగా లేకుంటే.. పంజాబ్ రైతుల ఉద్యమం వల్ల భారత్ మరో బంగ్లాదేశ్గా మారేదని కంగనా రనౌత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కంగనా రనౌత్ చేసిన ఈ ప్రకటనపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఎన్ఎస్ఏ కింద కంగనాపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అదే సమయంలో.. కంగనా ప్రకటనకు బీజేపీ దూరంగా ఉంది. ఇది ఆమె వ్యక్తిగత ప్రకటన అని, పార్టీకి దీనితో సంబంధం లేదని బీజేపీ పేర్కొంది.
READ MORE:Crime: ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత.. ప్రేమికుడిని ముక్కలుగా నరికి హత్య!
కంగనా వివాదాస్పద ప్రకటనపై బీజేపీ సెంట్రల్ మీడియా విభాగం అధికారిక ప్రకటన విడుదల చేసింది. రైతు ఉద్యమ సందర్భంలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇచ్చిన ప్రకటన పార్టీ అభిప్రాయం కాదన పేర్కొంది. కంగనా రనౌత్ ప్రకటనతో భారతీయ జనతా పార్టీ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది. కంగనా రనౌత్కు అలాంటి ప్రకటనలు చేయడానికి అనుమతి, అధికారం లేదు అని ప్రకటనలో తెలిపింది.
READ MORE: Fire Accident: బాపట్ల జిల్లా కర్లపాలెంలో అగ్నిప్రమాదం.. పేదల గుడిసెలు దగ్ధం
రైతుల ఉద్యమంపై కంగనా రనౌత్ ఏమన్నారు?
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మన అగ్రనాయకత్వం బలహీనంగా ఉంటే భారత్లో బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి వచ్చి ఉండేది. రైతుల ఉద్యమ సమయంలో ఏం జరిగిందో అందరూ చూశారు. ప్రదర్శనల పేరుతో హింసకు పాల్పడ్డారు.” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!