BJP: ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మాకొట్టడంపై బీజేపీ విమర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ముచ్చటగా ఐదోసారి ఈడీ విచారణకు డుమ్మాకొట్టారు. గతంలో నాలుగు సార్లు విచారణకు దూరంగా ఉన్నారు. తాజాగా శుక్రవారం కూడా ఆయన విచారణకు హాజరుకాలేదు. లిక్కర్ స్కామ్లో సీఎం కేజ్రీవాల్ను ఈడీ విచారణకు పిలిచింది. కానీ వరుసగా ఐదోసారి కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో కేజ్రీవాల్పై బీజేపీ విమర్శలు గుప్పించింది.
లిక్కర్ స్కామ్లో తనకేమీ సంబంధం లేనట్టుగా.. ఒక నిస్సహాయుడిగా కేజ్రీవాల్ చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేత హరీష్ ఖురానా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకవేళ ఈడీ సమన్లు చట్ట విరుద్ధమైతే కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. ఉద్దేశపూర్వకంగా ఈడీ నోటీసులు ఇస్తుంటే.. కోర్టుకెళ్లి ఎందుకు కొట్టివేయించుకోవడం లేదని హరీష్ ఖురానా ప్రశ్నించారు.
Also Read
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
ఈడీ నోటీసులపై గతంలో కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఈడీ సమన్లు చట్ట విరుద్ధమని కొట్టిపారేశారు. బీజేపీ ప్రేరేపితంతో ఈడీ నోటీసులు ఇస్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఈడీ ద్వారా ఇబ్బంది పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
లిక్కర్ స్కామ్లో నాలుగు సార్లు నోటీసులు ఇచ్చింది. గత నవంబర్ 2న, ఆ తర్వాత డిసెంబర్ 21, జనవరి 3, జనవరి 13న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు ఇచ్చింది. మరోసారి శుక్రవారం (2, ఫిబ్రవరి) విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. కానీ ఐదోసారి కూడా కేజ్రీవాల్ డుమ్మాకొట్టారు.
లిక్కర్ కేసులో గత ఏప్రిల్లో దాదాపు 9 గంటల పాటు సీబీఐ కేజ్రీవాల్ను విచారించింది. కానీ నిందితుడిగా మాత్రం చేర్చలేదు. కానీ ఇదే కేసులో ఆప్ ముఖ్య నేతలు ఎంపీ సంజయ్సింగ్, మాజీ మంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. గతేడాది ఫిబ్రవరిలో సిసోడియా, అక్టోబర్లో సంజయ్సింగ్ అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. పలుమార్లు బెయిల్ పిటిషన్లు కూడా రద్దు కావడంతో ఇంకా తీహార్ జైల్లోనే ఉన్నారు.
ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికల ముందు ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేసినట్టుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేసి పార్టీని బలహీనపర్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. వరుసగా ఐదోసారి కేజ్రీవాల్ డుమ్మాకొట్టారు. ఈడీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!