BJP: ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మాకొట్టడంపై బీజేపీ విమర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ముచ్చటగా ఐదోసారి ఈడీ విచారణకు డుమ్మాకొట్టారు. గతంలో నాలుగు సార్లు విచారణకు దూరంగా ఉన్నారు. తాజాగా శుక్రవారం కూడా ఆయన విచారణకు హాజరుకాలేదు. లిక్కర్ స్కామ్లో సీఎం కేజ్రీవాల్ను ఈడీ విచారణకు పిలిచింది. కానీ వరుసగా ఐదోసారి కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో కేజ్రీవాల్పై బీజేపీ విమర్శలు గుప్పించింది.
లిక్కర్ స్కామ్లో తనకేమీ సంబంధం లేనట్టుగా.. ఒక నిస్సహాయుడిగా కేజ్రీవాల్ చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేత హరీష్ ఖురానా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకవేళ ఈడీ సమన్లు చట్ట విరుద్ధమైతే కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. ఉద్దేశపూర్వకంగా ఈడీ నోటీసులు ఇస్తుంటే.. కోర్టుకెళ్లి ఎందుకు కొట్టివేయించుకోవడం లేదని హరీష్ ఖురానా ప్రశ్నించారు.
Also Read
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్లో భూకంపం..
ఈడీ నోటీసులపై గతంలో కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఈడీ సమన్లు చట్ట విరుద్ధమని కొట్టిపారేశారు. బీజేపీ ప్రేరేపితంతో ఈడీ నోటీసులు ఇస్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఈడీ ద్వారా ఇబ్బంది పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
లిక్కర్ స్కామ్లో నాలుగు సార్లు నోటీసులు ఇచ్చింది. గత నవంబర్ 2న, ఆ తర్వాత డిసెంబర్ 21, జనవరి 3, జనవరి 13న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు ఇచ్చింది. మరోసారి శుక్రవారం (2, ఫిబ్రవరి) విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. కానీ ఐదోసారి కూడా కేజ్రీవాల్ డుమ్మాకొట్టారు.
లిక్కర్ కేసులో గత ఏప్రిల్లో దాదాపు 9 గంటల పాటు సీబీఐ కేజ్రీవాల్ను విచారించింది. కానీ నిందితుడిగా మాత్రం చేర్చలేదు. కానీ ఇదే కేసులో ఆప్ ముఖ్య నేతలు ఎంపీ సంజయ్సింగ్, మాజీ మంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. గతేడాది ఫిబ్రవరిలో సిసోడియా, అక్టోబర్లో సంజయ్సింగ్ అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. పలుమార్లు బెయిల్ పిటిషన్లు కూడా రద్దు కావడంతో ఇంకా తీహార్ జైల్లోనే ఉన్నారు.
ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికల ముందు ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేసినట్టుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేసి పార్టీని బలహీనపర్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. వరుసగా ఐదోసారి కేజ్రీవాల్ డుమ్మాకొట్టారు. ఈడీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!