Rahul Gandhi: హర్యానా ఓటమి నుంచి పాఠాలు.. వాల్మీకి గుడిలో రాహుల్ గాంధీ పూజలు!
- హర్యానా ఓటమి నుంచి కాంగ్రెస్ పాఠాలు
- వాల్మీకి గుడిలో రాహుల్ గాంధీ పూజలు
- ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నం
- త్వరలో జార్ఖండ్.. మహారాష్ట్రలో పోలింగ్
- ఆయా రాష్ట్రాల్లో దళితుల శాతం ఎక్కువ
రెండు పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, జార్ఖండ్లలో ఎన్నికల నగారా మోగడంతో పార్టీలు మళ్లీ ప్రచారానికి దిగాయి. దళితుల ఓట్లను రాబట్టుకునే పనిలో పార్టీలన్నీ బిజీగా ఉన్నాయి. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా అన్ని పార్టీలు దళితులకు నిజమైన శ్రేయోభిలాషులు అనే సందేశాన్ని ఇవ్వడంలో బిజీగా ఉన్నాయి. హర్యానాలో వాల్మీకి జయంతి సందర్భంగా సీఎం నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని బీజేపీ నిర్వహించింది. ప్రమాణ స్వీకారానికి ముందు, సైనీ పంచకులలోని వాల్మీకి ఆలయానికి చేరుకుని ప్రార్థనలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఢిల్లీలోని వాల్మీకి ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. హర్యానాలో దళిత ఓటర్ల ఛిన్నాభిన్నం, ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్లలో వారిని ఆకర్శించే పనిలో పడింది.
READ MORE: Unstoppable 4 : బాలయ్య విత్ సీఎం అండ్ డిప్యూటీ.. రికార్డులూ ఊపిరి పీల్చుకోండి
Also Read
జార్ఖాండ్, మహారాష్ట్ర ఎన్నికలకు పార్టీలు సిద్ధం..
రాహుల్ గాంధీ వాల్మీకి దేవాలయంలో పూజలు చేసి దళిత ఓటర్లకు ఆకట్టుకునేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నం ప్రారంభించారు. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లోనూ దళితుల ఓట్లు చాలా ముఖ్యమైనవి. గెలుపు లేదా ఓటమిని నిర్ణయాత్మకంగా నిరూపించగలరు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు నవంబర్ 23న వెల్లడించనున్నారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో దళితుల జనాభా 14 శాతం. వీరిలో సగానికి పైగా మహర్లు కాగా, మిగిలిన వారు మాతంగ్, భంబీ మరియు ఇతర కులాలు. ఇది కాకుండా.. జనాభాలో 8 శాతం కంటే ఎక్కువ మంది షెడ్యూల్డ్ తెగ అంటే ఎస్టీ కమ్యూనిటీకి చెందినవారు.
READ MORE:Unstoppable 4 : బాలయ్య విత్ సీఎం అండ్ డిప్యూటీ.. రికార్డులూ ఊపిరి పీల్చుకోండి
హర్యానాలో కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణం ఇదే..
అదేవిధంగా జార్ఖండ్లో కూడా దళిత, గిరిజన ఓట్లు చాలా ముఖ్యమైనవి. జార్ఖండ్లో, షెడ్యూల్డ్ కులాల జనాభా 12 శాతం కాగా, గిరిజన సమాజ జనాభా 26 శాతం. హర్యానాలో కాంగ్రెస్ ఓటమికి దళితుల ఓట్లు చీలిపోవడమే ప్రధాన కారణం. ఎన్నికల తర్వాత సీఎస్డీఎస్- లోక్నీతి (CSDS-Lokniti) నిర్వహించిన సర్వే ప్రకారం.. హర్యానాలో కాంగ్రెస్కు జాతవ్ ఓట్ల మద్దతు లభించింది. అయితే జాతవ్- కాని దళితులు దాని నుంచి విడిపోయారు. పార్టీ దళిత ముఖం అయిన కుమారి సెల్జా జాతవ్ కమ్యూనిటీ నుంచి వచ్చింది. సర్వే ప్రకారం కాంగ్రెస్కు దాదాపు 50 శాతం జాతవ్ ఓట్లు రాగా, జాతవేతర ఓట్లు 33 శాతం మాత్రమే వచ్చాయి. మరోవైపు బీజేపీకి 35 శాతం జాతవ్, 43 శాతం నాన్ జాతవ్ ఓట్లు వచ్చాయి.
Lok Sabha LoP and Congress MP Rahul Gandhi offered prayers at the Valmiki Temple in Delhi on the occasion of Maharishi Valmiki Jayanti today
(Source: AICC) pic.twitter.com/5YWyPyVwAI
— ANI (@ANI) October 17, 2024
- Tags
- bjp
- bjp congress
- congress
- Election
- india
తాజావార్తలు
-
Air Cooler: రోజుకు 8 గంటలు కూలర్ ఆన్లో ఉంటే ఎంత బిల్లు వస్తుందో తెలుసా?
-
Jabalpur Boat Tragedy: “లైఫ్ జాకెట్” ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
-
Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం… పగలు సెగలు..సాయంత్రం జల్లులు
-
SRH vs KKR IPL 2026: అరుదైన రికార్డు సాధించిన సునీల్ నరైన్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ఆటగాడిగా..
-
Donald Trump: జర్మనీకి డబుల్ షాక్ ఇచ్చిన ట్రంప్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!