JP. Nadda: కాంగ్రెస్ స్కామ్ల పార్టీ.. బీఆర్ఎస్ ఏటీఎం పార్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్, బీఆర్ఎస్.. రెండూ కుటుంబ పార్టీలేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో బీజేపీ జన సభ జరిగింది. భువనగిరి పార్లమెంటు పరిధి నుంచి భారీగా బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నరసయ్యగౌడ్ తరపున జేపీ నడ్డా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్లపై ధ్వజమెత్తారు. తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసింది శూన్యమని విమర్శించారు. ఈ రెండు పార్టీలు కుటుంబ పార్టీలేనన్నారు.
ఇది కూడా చదవండి: Throw Back: కడుపుతో ఉన్న నటిని 51 సార్లు కత్తితో పొడిచి, 16 ముక్కలుగా నరికి చంపారు!
Also Read
- Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
- Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
కాంగ్రెస్ కుంభకోణాల పార్టీ.. కాళేశ్వరం బీఆర్ఎస్కు ఏటీఎంగా మారిందని విమర్శించారు. అవినీతి కేసులో కవిత జైలుకెళ్లారని పేర్కొన్నారు. రిజర్వేషన్లు పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించి.. మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీలను మోసం చేసి.. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో కోత విధించేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని తెలిపారు. అయోధ్యలో రాముడికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు లేవని పార్లమెంట్లో చెప్పి మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. హిందుత్వానికి కాంగ్రెస్ పార్టీ విరోధి అని వ్యాఖ్యానించారు. టెర్రరిస్టులపై సర్జికల్ స్ట్రైక్లు చేస్తే కాంగ్రెస్ నేతలు ఆధారాలు చూపించాలని అడుగుతున్నారని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Pushkar Singh Dhami: మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుంది..
భారత రాజకీయాలను సమూలంగా మార్చివేసిన దార్శనికుడు ప్రధాని నరేంద్ర మోడీ అని తెలిపారు. దేశంలో జవాబు దారి రాజకీయాలకు మోడీ నాంది పలికారన్నారు. సంక్షేమ పథకాలు ప్రకటించడమే తప్ప.. అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదని జేపీ.నడ్డా ధ్వజమెత్తారు.
తెలంగాణలో నాల్గో విడతలో పోలింగ్ జరగనుంది. మే 13న తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మంగళవారం మూడో విడత పోలింగ్ జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
#WATCH | Telangana: At a public gathering in Yadadri Bhuvanagiri, BJP national president JP Nadda says "PM Modi has left no stone unturned for the development of Telangana…The railway budget of Telangana has been increased by 20 times…Three Vande Bharat trains are already… pic.twitter.com/iSlvQNFHdc
— ANI (@ANI) May 6, 2024
తాజావార్తలు
-
Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
-
Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
-
Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
-
Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!