JP. Nadda: కాంగ్రెస్ స్కామ్ల పార్టీ.. బీఆర్ఎస్ ఏటీఎం పార్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్, బీఆర్ఎస్.. రెండూ కుటుంబ పార్టీలేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో బీజేపీ జన సభ జరిగింది. భువనగిరి పార్లమెంటు పరిధి నుంచి భారీగా బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నరసయ్యగౌడ్ తరపున జేపీ నడ్డా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్లపై ధ్వజమెత్తారు. తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసింది శూన్యమని విమర్శించారు. ఈ రెండు పార్టీలు కుటుంబ పార్టీలేనన్నారు.
ఇది కూడా చదవండి: Throw Back: కడుపుతో ఉన్న నటిని 51 సార్లు కత్తితో పొడిచి, 16 ముక్కలుగా నరికి చంపారు!
Also Read
- IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
- Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
- Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
కాంగ్రెస్ కుంభకోణాల పార్టీ.. కాళేశ్వరం బీఆర్ఎస్కు ఏటీఎంగా మారిందని విమర్శించారు. అవినీతి కేసులో కవిత జైలుకెళ్లారని పేర్కొన్నారు. రిజర్వేషన్లు పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించి.. మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీలను మోసం చేసి.. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో కోత విధించేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని తెలిపారు. అయోధ్యలో రాముడికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు లేవని పార్లమెంట్లో చెప్పి మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. హిందుత్వానికి కాంగ్రెస్ పార్టీ విరోధి అని వ్యాఖ్యానించారు. టెర్రరిస్టులపై సర్జికల్ స్ట్రైక్లు చేస్తే కాంగ్రెస్ నేతలు ఆధారాలు చూపించాలని అడుగుతున్నారని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Pushkar Singh Dhami: మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుంది..
భారత రాజకీయాలను సమూలంగా మార్చివేసిన దార్శనికుడు ప్రధాని నరేంద్ర మోడీ అని తెలిపారు. దేశంలో జవాబు దారి రాజకీయాలకు మోడీ నాంది పలికారన్నారు. సంక్షేమ పథకాలు ప్రకటించడమే తప్ప.. అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదని జేపీ.నడ్డా ధ్వజమెత్తారు.
తెలంగాణలో నాల్గో విడతలో పోలింగ్ జరగనుంది. మే 13న తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మంగళవారం మూడో విడత పోలింగ్ జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
#WATCH | Telangana: At a public gathering in Yadadri Bhuvanagiri, BJP national president JP Nadda says "PM Modi has left no stone unturned for the development of Telangana…The railway budget of Telangana has been increased by 20 times…Three Vande Bharat trains are already… pic.twitter.com/iSlvQNFHdc
— ANI (@ANI) May 6, 2024
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!