MLC Celebrations: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా విజయోత్సవ సంబరాలు
- టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం
- బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా విజయోత్సవ సంబరాలు.
- మల్క కొమురయ్య గెలుపుతో రేవంత్ సర్కార్ పతనానికి నాంది
- రాజ్యసభ సభ్యులు కే.లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Celebrations: కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట సంబరాలు వెల్లివిరిశాయి. ఈ కార్యక్రమంలో మల్క కొమురయ్యతో పాటు బీజేపీ రాజ్యసభ సభ్యులు కే.లక్ష్మణ్, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
Read Also: Obesity Causes: అతిగా తినడం మాత్రమే కాదు.. ఈ తప్పులు కూడా ఊబకాయానికి కారణాలే
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- AI Job Fears: 'నా ఉద్యోగం సేఫ్నా?'.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
- Vaibhav's Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
- Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు కే.లక్ష్మణ్ మాట్లాడుతూ.. మల్క కొమురయ్య గెలుపుతో రేవంత్ సర్కార్ పతనానికి నాంది పడ్డట్లు వ్యాఖ్యానించారు. 317 జీవోపై బీజేపీ అలుపెరగని పోరాటం చేసిందని గుర్తుచేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో మల్క కొమురయ్య మండలిలో వినిపిస్తారని అన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని, ఉపాధ్యాయుల ఆవేదన ప్రభుత్వానికి తీవ్ర ఝలక్ ఇస్తుందని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతోందనడానికి నిదర్శనమని కే.లక్ష్మణ్ స్పష్టం చేశారు. బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, పార్టీపై ఎదురు దాడులు చేయడం తగదని అన్నారు. తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని ఆయన వివరించారు.
Read Also: APPSC Jobs Age Limit: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రిక్రూట్మెంట్ వయోపరిమితి పెంపు
ఇక ఎమ్మెల్సీ మల్క కొమురయ్య మాట్లాడుతూ.. తన విజయంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర, రాష్ట్ర పార్టీ నాయకత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో తనపై జరిగిన దుష్ప్రచారాలను తిప్పికొట్టిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు చెప్పారు. తనను కార్పొరేట్ అభ్యర్థిగా ప్రచారం చేశారని.. కానీ, తాను ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పూర్తి పట్టుదలతో ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. 317 జీవో చాలా దుర్మార్గమైనదని, దానిపై తమ పోరాటం కొనసాగుతుందని మల్క కొమురయ్య హామీ ఇచ్చారు. విద్యాశాఖలో అనేక సమస్యలు ఉన్నాయని, ఉపాధ్యాయులు సతమతమవుతున్నారని, దానితో పిల్లలకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి ఎప్పుడూ అండగా ఉంటానని ఆయన అన్నారు. వీలైనంతవరకు ఉపాధ్యాయులతోనే ఉంటానని మల్క కొమురయ్య తెలిపారు.
తాజావార్తలు
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
-
Vaibhav’s Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!