Lok Sabha Elections 2024: నేడు బిజెపి ఐదవ జాబితా.. ఐదు రాష్ట్రాల్లో అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections 2024: 2024 లోక్సభ ఎన్నికలకు బిజెపి అభ్యర్థుల ఐదవ జాబితా ఈరోజు వచ్చే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల (ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్) అభ్యర్థుల పేర్లను విడుదల చేసే జాబితా మధ్యాహ్నం వచ్చే వీలుంది. ఈ జాబితాకు సంబంధించి బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ (సిఇసి) సమావేశం శనివారం (మార్చి 23, 2024) రాత్రి సుమారు మూడు గంటలపాటు కొనసాగింది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ ఐదో జాబితాలో చేరాల్సిన పేర్లపై చర్చలు జరిగాయి. యూపీలోని మిగిలిన 24 స్థానాల్లో (అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది) 10 స్థానాలకు పేర్లు ఖరారు చేసినట్లు తెలిసింది. ఘజియాబాద్ నుంచి అతుల్ గార్గ్, మీరట్ నుంచి అరుణ్ గోవిల్, సహరన్పూర్ నుంచి రాఘవ్ లఖన్పాల్, మొరాదాబాద్ నుంచి కున్వర్ సర్వేష్ సింగ్లకు అవకాశం దక్కవచ్చు.
Also Read
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
- TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
- Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
ధర్మేంద్ర ప్రధాన్, సంబిత్ పాత్రకు టిక్కెట్లు దాదాపు కన్ఫర్మ్!
ఈ సమావేశంలో ఒడిశాలోని 21 స్థానాలకు అభ్యర్థుల పేర్లను చర్చించినట్లు వర్గాల సమాచారం. సంభల్పూర్ నుండి ధర్మేంద్ర ప్రధాన్, పూరీ నుండి సంబిత్ పాత్ర మరియు భువనేశ్వర్ నుండి అపరాజిత సారంగికి టిక్కెట్లు ఇవ్వవచ్చు. అలాగే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలను కూడా తొలగించవచ్చని చెప్పారు.
ఒడిశాలోని మొత్తం 21 స్థానాలపై చర్చ
ఒడిశాలోని మొత్తం 21 లోక్సభ స్థానాలు, 147 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను సీఈసీ చర్చించిందని బీజేపీ ఒడిశా విభాగం అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ మీడియాకు తెలిపారు. ఒడిశాలో బీజేపీ, బిజూ జనతాదళ్ (బీజేడీ) మధ్య ఎన్నికలకు ముందు పొత్తుపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ చర్చ జరిగింది.
బీహార్-మహారాష్ట్రపై చర్చ
రాజస్థాన్లోని ఎనిమిది స్థానాలపై సమావేశంలో చర్చించగా, పశ్చిమ బెంగాల్లోని మిగిలిన అన్ని స్థానాలపై చర్చించారు. అయితే రాష్ట్రంలో మూడు సీట్లపై చర్చ ఇంకా పెండింగ్లో ఉంది. పార్టీ సీఈసీ తదుపరి సమావేశంలో బీహార్, మహారాష్ట్రపై చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇప్పటి వరకు ప్రకటించిన స్థానాలు
సీఈసీ గతంలో రెండుసార్లు సమావేశమై 291 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ సమావేశాల్లో ఉత్తరప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్, కేరళ, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల సీట్లపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రాష్ట్రాల్లో కొన్ని స్థానాలకు బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.
ఏడు దశల్లో ఎన్నికలు
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సహా పార్టీ ముఖ్య నేతల పేర్లను ఇప్పటికే ప్రకటించారు. ఈ పార్టీ ప్రముఖులందరూ ఇప్పటికే ఉన్న నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్నారు, ఏప్రిల్ 19, జూన్ 1 మధ్య 543 లోక్సభ స్థానాలకు ఏడు దశల ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4, 2024 న జరుగుతుంది.
తాజావార్తలు
-
Operation Checkmate: ‘ఆపరేషన్ చెక్మేట్’లో 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు అరెస్ట్.. అమెరికా నుంచి బహిష్కరణకు సిద్ధం
-
Peddi Inside Talk : ‘పెద్ది’ ఇన్ సైడ్ రిపోర్ట్.. ఫస్టాఫ్ అదిరింది..సెకండాఫ్ కొంచం?
-
Venkatesh Iyer: ఓ పద్దతి, విధానం.. విరాట్ కోహ్లీ విజయ రహస్యం చెప్పేసిన వెంకటేశ్!
-
Bab el-Mandeb Strait: ప్రపంచానికి ఇంధన షాక్?.. హార్మూజ్ తర్వాత మరో కీలక జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిక
-
CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!