Rahul Gandhi: బీజేపీని ఓడించొచ్చు.. అమెరికాలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ.. అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన అమెరికా వేదికగా బీజేపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. మోడీ సర్కారు భారత ప్రజలను భయపెడుతోందని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఇక, ప్రధాని మోదీ దేవుడికే పాఠాలు చెప్పే ఘనుడంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ప్రతిపక్షాలను సరిగ్గా సమీకరించినట్లయితే అధికార బీజేపీని ఓడించవచ్చని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ దాని కోసం కృషి చేస్తోందన్నారు. ప్రతిపక్షాల ఐక్యత కోసం తాము కృషి చేస్తు్న్నామన్నారు.
‘‘ప్రతిపక్షాలన్నీ సరిగ్గా ఏకమైతే బీజేపీ కచ్చితంగా ఓడిపోతుంది. కర్ణాటక ఎన్నికలే అందుకు ఉదాహరణ. విపక్షాల ఐక్యత కోసం మేం చర్యలు తీసుకుంటున్నాం. అయితే కేవలం ఐక్యత మాత్రమే సరిపోదు.. ప్రత్యామ్నాయ వ్యూహాలు కూడా అవసరం’’ అని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా తెలిపారు. ఇక, ప్రపంచ మీడియాలో చూపించినట్లుగా భారత్లో పరిస్థితులు లేవని రాహుల్ ఆరోపించారు. అదంతా రాజకీయ ప్రచారమే అని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. వాస్తవంలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయన్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
మంగళవారం శాంటా క్రూజ్లోని కాలిఫోర్నియా యూనివర్శిటీలోని సిలికాన్ వ్యాలీ క్యాంపస్లో జరిగిన కార్యక్రమంలో మోడరేటర్, ప్రేక్షకుల ప్రశ్నలకు సమాధానమిస్తూ, బీజేపీలోని బలహీనతలను తాను స్పష్టంగా చూడగలనని అన్నారు. రాజకీయ పారిశ్రామికవేత్తగా బీజేపీలోని బలహీనతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని… ప్రతిపక్షాలు సక్రమంగా ఉంటేనే బీజేపీని ఓడించగలమని అన్నారు.కర్నాటక ఎన్నికలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పోరాడి బీజేపీని ఓడించిందని జనరల్ సెన్స్ అర్థమవుతోందని, అయితే మనం ఉపయోగించిన మెకానిక్లు ఏంటో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఎదుర్కోవడానికి, కథనాన్ని రూపొందించడానికి పూర్తిగా భిన్నమైన విధానాన్ని ఉపయోగించింది. కర్ణాటకలో ఏమి జరిగిందో ‘భారత్ జోడో యాత్ర’ నుంచి బయటకు వచ్చాయని రాహుల్ గాంధీ అన్నారు.
Read Also: Burnt Alive: కారులో చెలరేగిన మంటలు.. నూతన వధూవరులతో పాటు నలుగురు సజీవదహనం
224 మంది సభ్యుల కర్ణాటక అసెంబ్లీకి మే 10న జరిగిన ఎన్నికలలో, కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 66, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (సెక్యులర్) 19 స్థానాలను గెలుచుకున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ 10 రెట్లు ఎక్కువ డబ్బు ఖర్చు చేసిందని రాహుల్ గాంధీ అన్నారు. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఐక్య ప్రతిపక్షంగా ఉండటంతో పాటు, అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఓడించేందుకు దేశానికి ప్రత్యామ్నాయ దృక్పథం అవసరమని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
-
Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!