BJD: బీజేపీకి మద్దతు ఇచ్చేది లేదు.. తేల్చి చెప్పిన బీజేడీ
- బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ పార్టీ రాజ్యసభ సభ్యులతో సమావేశం
- పార్లమెంటు సమావేశాలలో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని పిలుపు
- బీజేపీకి మద్దతు ఇచ్చేది లేదు.. తేల్చి చెప్పిన బీజేడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిజూ జనతాదళ్ (బీజేడీ) అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ తన పార్టీకి చెందిన 9 మంది రాజ్యసభ సభ్యులతో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. జూన్ 27 నుండి ప్రారంభమయ్యే పార్లమెంటు ఎగువ సభ సమావేశాలలో బలమైన ప్రతిపక్ష పాత్రను పోషించాలని పట్నాయక్ వారికి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను తగిన రీతిలో లేవనెత్తాలని ఎంపీలను కోరారు. సమావేశం అనంతరం రాజ్యసభలో పార్టీ నేత సస్మిత్ పాత్ర మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈసారి బీజేడీ ఎంపీలు కేవలం సమస్యలపై మాట్లాడటానికే పరిమితం కానున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒడిశా ప్రయోజనాలను విస్మరిస్తే ఉద్యమించాలని నిర్ణయించాం’ అని తెలిపారు.
Read Also: Kadapa Crime: తల్లితో సహజీవనం.. నిలదీసిన కొడుకు దారుణ హత్య..
Also Read
- Iran Oil: భారత్పై ఇరాన్ ఆశలు.. సముద్రంలో భారీగా చమురు..
- Monsoon: రుతుపవనాలపై ఐఎండీ శుభవార్త.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
- Bharat tiwari: బీహార్ను కుదిపేస్తున్న భరత్ తివారీ ఎన్కౌంటర్.. పోలీసులపై ఎఫ్ఐఆర్.
ఒడిశాకు ప్రత్యేక హోదా డిమాండ్ను లేవనెత్తడమే కాకుండా.. రాష్ట్రంలో మొబైల్ కనెక్టివిటీ, తక్కువ సంఖ్యలో బ్యాంకు శాఖల సమస్యను కూడా పార్టీ ఎంపీలు లేవనెత్తుతారని సస్మిత్ పాత్ర తెలిపారు. మరోవైపు.. బొగ్గు రాయల్టీలో సవరణ చేయాలన్న ఒడిశా డిమాండ్ను గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. దీని వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందని.. వారికి దక్కాల్సిన వాటా దక్కకుండా పోతుందన్నారు. రాజ్యసభలో 9 మంది ఎంపీలు బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తారని సుస్మిత్ పాత్రా తెలిపారు.
Read Also: India Squad For Zimbabwe : జింబాబ్వే టూర్కు టీమ్ని ప్రకటించిన బిసిసిఐ.. తెలుగోడికి చోటు..
ఇకపై.. తాము బీజేపీకి మద్దతు తెలిపేది లేదని, ప్రతిపక్షంగానే కొనసాగుతామని తెలిపారు. ఒడిశా ప్రయోజనాలను కాపాడేందుకు ఎంతవరకైనా వెళ్తామన్నారు. ఒడిశా డిమాండ్లను ఎన్డీఏ ప్రభుత్వం విస్మరిస్తే.. బలమైన, శక్తివంతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని తమ అధ్యక్షుడు చెప్పారని సుస్మిత్ పాత్రా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Iran Oil: భారత్పై ఇరాన్ ఆశలు.. సముద్రంలో భారీగా చమురు..
-
Monsoon: రుతుపవనాలపై ఐఎండీ శుభవార్త.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
-
Padma Awards: దిగ్గజాలకు పద్మ పురస్కారాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానం!
-
Sanjeev Bikhchandani: ఒక్క నిర్ణయం.. వేల కోట్ల సామ్రాజ్యం! నౌక్రీ.కామ్ బాస్ ఇన్వెస్ట్మెంట్ మ్యాజిక్ చూశారా?
ట్రెండింగ్
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?