Kolkata: రన్వేపైకి ఒకేసారి రెండు విమానాలు.. తప్పిన పెద్ద ముప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతా ఎయిర్పోర్టులో ఘోర విమాన ప్రమాదం తప్పింది. ఒకే రన్ వేపైకి రెండు విమానాలు రావడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో విమాన రెక్కలు విరిగిపడ్డాయి. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో ప్రయాణికులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది.
ఒక విమానం చెన్నైకి వెళ్తుంటే.. మరొక విమానం దర్భంగాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా డీజీసీఏ పేర్కొంది. ఒకే రన్ వేపైకి వచ్చి ఢీకొట్టుకోవడంతో విమానాల రెక్కలు విరిగిపోయాయని తెలిపింది. ఇక ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక

బుధవారం ఉదయం 10.40 గంటల ప్రాంతంలో ఎయిరిండియా విమానం చెన్నైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. విమానంలో ఆరుగురు క్యాబిన్ సిబ్బందితో పాటు 163 మంది ప్రయాణికులు ఉన్నారు. మరో విమానం ఇండిగోకు చెందింది కాగా.. కోల్కతా నుంచి దర్భంగాకు వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ విమానంలో ఆరుగురు క్యాబిన్ సిబ్బందితో పాటు 149 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ రెండు విమానాలు ఒకేసారి రన్వేపైకి వచ్చేశాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని డీజీసీఏ వెల్లడించింది. విచారణ సమయంలో సిబ్బందిని కూడా విచారిస్తామని తెలిపింది. ఈ ఘటన తర్వాత పైలట్లను విధుల నుంచి తొలగించాయి. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో వందలాది మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమాన రెక్కలు రన్వేపై పడి ఉన్నాయి.

తాజావార్తలు
-
Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
-
Astrology: కెరీర్లో నెమ్మదిగా ఎదిగినా.. చివరికి పెద్ద స్థాయికి చేరుకునే 3 రాశులు ఇవేనా?
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!