TDP: కర్నూలు జిల్లా టీడీపీలో కుదుపు..! పార్టీకి కీలక నేతలు గుడ్బై..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP: ఎన్నికల సమయంలో.. నేతలు పార్టీలు మారడం సర్వసాధారణమైన విషయమే.. ఒక పార్టీలో సీటు దక్కలేదని.. మరో పార్టీ గూటికి చేరడం.. ప్రతీ ఎన్నికల్లో చూస్తూనే ఉంటాం.. అయితే, ఈ సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి భారీ గండి పడుతుందనే ప్రచారం సాగుతోంది.. జనసేన, బీజేపీలతో పొత్తుతో ఎన్నికలకు వెళ్తోంది తెలుగుదేశం పార్టీ.. పొత్తుల్లో భాగంగా కొందరు నేతలకు సీట్లు దక్కకపోతే.. మరికొన్ని స్థానాల్లో సీటు ఆశించినవారికి భంగపాటు తప్పలేదు. వాళ్లను కాదని మరో నేతకు సీటు కేటాయించడం కూడా ఆ పార్టీలో కుంపటి రాజేసింది.. అయితే, కర్నూలు జిల్లాలో టీడీపీకి భారీ గండి పడే అవకాశం ఉందంటున్నారు.. పార్టీలో కీలక నేతలుగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారట.
Read Also: Mudragada Vs Pawan Kalyan: పవన్ కల్యాణ్పై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
- Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో పలువురు కీలక నేతలు ఉన్నారనే ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.. ఈ నెల 12వ తేదీన పలువురు టీడీపీ నేతలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది.. ఇప్పటికే వైసీపీతో టచ్ లోకి వెళ్లిపోయారట కొందరు నేతలు.. వారి దారిలోనే మరికొందరు నేతలు కూడా పార్టీని వీడే యోచనలో ఉన్నారట.. 12వ తేదీన సీఎం జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ మసాలా పద్మజ, ఆలూరు మాజీ టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం మల్లికార్జున, ఇద్దరు మాజీ జెడ్పీటీసీలు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారట.. ఇక, రామసుబ్బారెడ్డి తో ఇప్పటికే చర్చలు జరిపారట మాజీ మంత్రి కేఈ ప్రభాకర్.. కానీ, కేఈ ప్రభాకర్ టీడీపీ వీడకుండా కేఈ కృష్ణమూర్తి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తురని తెలుస్తోంది.. మరోవైపు మంత్రాలయం టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు తిక్కారెడ్డి.. పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చలతో సంతృప్తి పడలేదు.. మంత్రాలయం అసెంబ్లీ టికెట్ పై ఇప్పటికీ పట్టు వీడడం లేదు తిక్కారెడ్డి.. ఈ నేపథ్యంలో.. తిక్కారెడ్డి కూడా తన రాజకీయ భవిష్యత్పై ఓ నిర్ణయానికి వస్తారనే ప్రచారం సాగుతోంది. మరి ఈ వలసలకు టీడీపీ చెక్ పెడుతుందా? లేదంటా కర్నూలు జిల్లాలో టీడీపీలో భారీ కుదుపు తప్పదా? అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?