Ratan Tata : సంచలనంగా రతన్ టాటా వీలునామా.. రూ.500కోట్లు పొందిన మిస్టరీ మ్యాన్ ఎవరు ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ratan Tata : దివంగత పారిశ్రామిక వేత్త రతన్ టాటా వీలునామా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇటీవల ఆయన వీలునామా బహిర్గతం కావడం టాటా కుటుంబంలో, టాటా గ్రూప్లో కలకలం మొదలైంది. రతన్ టాటా తన సంపదలో మూడింట ఒక వంతు, అంటే దాదాపు రూ. 500 కోట్లు.. చాలా మందికి తెలియని వ్యక్తికి కట్టబెట్టాడు. ఈ వ్యక్తి పేరు మోహిని మోహన్ దత్తా, తను జంషెడ్పూర్ నివాసి, ట్రావెల్ రంగంలో పనిచేస్తుంటారు. మోహిని మోహన్ దత్తా కుటుంబం ‘స్టాలియన్’ అనే ట్రావెల్ ఏజెన్సీని నడిపింది. దీనిని 2013లో తాజ్ సర్వీసెస్లో విలీనం చేశారు. తాజ్ సర్వీసెస్ తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్లో భాగం. స్టాలియన్లో దత్తా కుటుంబం 80శాతం వాటాను కలిగి ఉండగా, మిగిలిన 20శాతం టాటా ఇండస్ట్రీస్ కలిగి ఉంది. దీనితో పాటు, దత్తా థామస్ కుక్తో అనుబంధించబడిన టీసీ ట్రావెల్ సర్వీసెస్ అనే సంస్థకు డైరెక్టర్గా కూడా ఉన్నారు.
రతన్ టాటా, మోహిని దత్తా మధ్య సంబంధం
మీడియా నివేదికల ప్రకారం.. రతన్ టాటాకు మోహినీ మోహన్ దత్తా తన పాత స్నేహితుడని, అతని కుటుంబ సభ్యులకు కూడా అతడి గురించి తెలుసంటూ చెబుతున్నారు. ఈ విషయంలో దత్తా ఎటువంటి స్పందన ఇవ్వలేదు. రతన్ టాటా కార్యనిర్వాహకులలో ఆయన సవతి సోదరీమణులు షిరిన్, దినా జెజీభోయ్ కూడా ఉంటారు. కానీ వారు కూడా ఈ విషయంపై వ్యాఖ్యానించలేదు. ఇతర కార్యనిర్వాహకులు డారియస్ ఖంబట్టా, మెహ్లి మిస్త్రీ కూడా దీనిపై ఏమీ మాట్లాడలేదు.
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
Read Also:AP Budget Session: 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
టాటా కుటుంబంతో దత్తా సంబంధం
మోహిని దత్తాకు ఇద్దరు కుమార్తెలు, వారిలో ఒకరు 2024 వరకు తొమ్మిది సంవత్సరాలు టాటా ట్రస్ట్స్లో పనిచేశారు. రతన్ టాటాకు 24 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, జంషెడ్పూర్లోని డీలర్స్ హాస్టల్లో తాను మొదటిసారి రతన్ టాటాను కలిశానని దత్తా ఒకసారి మీడియాతో అన్నారు. రతన్ టాటా తనకు సహాయం చేశారని, ముందుకు సాగడానికి అవకాశం ఇచ్చారని ఆయన అన్నారు. దత్తా కూడా తాము 60 సంవత్సరాలుగా ఒకరినొకరు తెలుసని పేర్కొన్నారు.
రతన్ టాటా వీలునామా, విరాళం
రతన్ టాటా తన సంపదలో ఎక్కువ భాగాన్ని దాతృత్వానికి వదిలిపెట్టారు. ఇది కాకుండా, అతను తన సవతి సోదరీమణుల కోసం తన వీలునామాలో కొంత మొత్తాన్ని కూడా ఉంచాడు. తన సవతి సోదరీమణులు కూడా తమ వాటాను విరాళంగా ఇవ్వాలనే కోరికను వ్యక్తం చేశారు. ఈ వెల్లడి టాటా గ్రూప్లో లోతైన చర్చను సృష్టించింది. ఆస్తి విభజనను నిశితంగా పరిశీలిస్తారని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
Read Also:Delhi Elections: దుమారం రేపుతున్న అభ్యర్థుల కొనుగోలు వ్యవహారం.. విచారణకు ఎల్జీ ఆదేశం
రతన్ టాటా సంపద
టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ లో రతన్ టాటా 0.83శాతం వాటాను కలిగి ఉన్నారు. ఆయన నికర విలువ దాదాపు రూ. 8,000 కోట్లుగా అంచనా. అయితే, అతని వాస్తవ సంపద చాలా ఎక్కువగా ఉండవచ్చు, అందులో ఫెరారీ, మసెరటి వంటి లగ్జరీ కార్లు, ఖరీదైన పెయింటింగ్లు, స్టార్టప్లలో పెట్టుబడులు, ఇతర వ్యక్తిగత పెట్టుబడులు ఉన్నాయి. రతన్ టాటా తన వ్యక్తిగత పెట్టుబడుల కోసం RNT అసోసియేట్స్ అనే వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇది 2023 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 186 కోట్ల పెట్టుబడిని కలిగి ఉంది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!