Komatireddy Venkat Reddy: షోకాజ్ నోటీసులు చెత్తబుట్టలోపడేశా.. పీసీసీ కమిటీలను పట్టించుకోను
Komatireddy Venkat Reddy: తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇంఛార్జీ మాణిక్ రావ్ థాక్రే తో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ ముగిసింది. హైద్రాబాద్ హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్న థాక్రేతో సమావేశమైన కోమటిరెడ్డి మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తనకిచ్చిన AICC షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయని సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి. పీసీసీ కమిటీలను నేను పట్టించుకోనని అన్నారు. నాలుగైదుసార్లు ఓడిపోయినవాళ్లతో నేను కూర్చోవాలా? అంటూ ప్రశ్నించారు. నిన్న నియోజకవర్గ పర్యటనల వల్ల థాక్రేను కలవలేకపోయానని అన్నారు. సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి ఎందుకు మీటింగ్ రాలేదో అడగండి ముందు అంటూ కోమటిరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్నిసార్లు నియోజకవర్గ పనులతో కలవలేమన్నారు. నా ఫోటో మార్ఫింగ్ అయిందని స్వయానా సీపీ నాకు చెప్పారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
కాగా.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ పదవి నుండి మాణిక్కం ఠాగూర్ ను పార్టీ జాతీయ నాయకత్వం తప్పించింది. దీంతో..తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యహరాల ఇంచార్జీగా నియామాకమైన తర్వాత మాణిక్ రావు థాక్రే నిన్న హైద్రాబాద్ కు వచ్చారు. ఈనేపథ్యంలో.. హైద్రాబాద్ కు వచ్చిన తర్వాత థాక్రే పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్లతో థాక్రే సమావేశాలు నిర్వహించారు. ఇవాళ కూడా పార్టీ నేతలతో థాక్రే సమావేశాలు నిర్వహించనున్నారు. కాగా..గతఏడాది డిసెంబర్ మాసంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే. రాష్ట్ర పర్యటనకు వచ్చే ముందు గాంధీభవన్ కు రావాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఠాక్రే ఫోన్ చేశారు. అయితే తాను గాంధీ భవన్ కు రానని వెంకట్ రెడ్డి చెప్పినట్టుగా సమాచారం. అంతే దీంతో హైదర్ గూడలోఉన్న థాక్రేతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశంమయ్యారు. ఖర్గేతో భేటీ అయిన మరునాడే ప్రధాని మోడీతో కూడా వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు. అయితే..తన నియోజకవర్గంలో అభివృద్దికి సంబంధించిన నిధుల విడుదల విషయమై మోడీతో చర్చించినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే..
Chiranjeevi: రోజాపై కామెంట్ చేయను.. గతంలో తనతో కలిసి అలా..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో